Home » పవిత్రతో బంధంపై నరేష్ భార్య కామెంట్స్..!

పవిత్రతో బంధంపై నరేష్ భార్య కామెంట్స్..!

by Azhar
Ad
నరేష్, పవిత్రల బంధం గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్టాలు మాట్లాడుకుంటున్నాయి అనేది నిజం. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ఇప్పుడు పవిత్రతో కలిసి ప్రేమాయణం నడిపిస్తున్నాడు అనే చర్చ గత కొంతకాలంగా వైరల్ అవుతుంది. అయితే పవిత్ర కూడా తక్కువేం కాదు. ఇప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ వారితో పవిత్ర విడిపోయింది. ఇక ఇప్పుడు నరేష్ తో బంధం కొనసాగిస్తోంది అని అంటున్నారు. కానీ వీరి ఇద్దరి బంధం పైన నరేష్ భార్య రమ్య మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అనునిత్యం నరేష్ ను ఫాలో అవుతుంటే ఉంటుంది.
అయితే నరేష్ తన మూడో భార్య అయిన రమ్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదు. కానీ ఆమె వేరే వారితో సంబంధం పెట్టుకొని తనకు బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెబుతున్నాడు నరేష్. అందుకే ఆమెతో ఉండకుండా.. దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. కానీ రమ్య మాత్రం అవి అబద్దాలు అని.. నరేష్ తనకే కావాలని అంటుంది. ఇక పవిత్రతో నరేష్ కు ఉన్న బంధాన్ని మీడియా ముందుకు తెచ్చింది కూడా రమ్యనే. అలాగే వీరిద్దరూ కలిసి హోటల్ లోని ఒక్కే రూమ్ లో ఉన్న విషయాన్ని అందరి ముందు బట్టబయలు చేసింది రమ్య.
ఆ తర్వాత నుండి వీరి వ్యవహారం అనేది రచ్చగా మారింది. రమ్య తనను మోసం చేసింది అని నరేష్ కామెంట్స్ చేస్తున్నాడు. కానీ రమ్య మాత్రం నాకు విడాకులు ఇవ్వకుండా నరేష్ పవిత్రలో ఎలా ఉంటాడు అని ప్రశ్నిస్తుంది. ఇక వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో రమ్య ఈ వ్యవహారాన్ని మీడియా ముందుకు తెచ్చి.. ఇది నా ఆవేదన అంటూ కామెంట్స్ చేస్తుంది. ఇక ఈ రచ్చ అనేది ఎప్పుడు ముగుస్తుంది… నరేష్ ఈ వ్యవహారాన్ని మొత్తం ఎలా హ్యాండిల్ చేస్తాడు.. ఎలా సెటిల్ చేస్తాడు అనేది ఇప్పుడు అందరికి పెద్ద ప్రశ్నగా మారింది. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఈ రచ్చ ఏకాడికి వెళ్తుంది అనేది.

Advertisement

Visitors Are Also Reading