Home » పంత్ లా మారిపోయిన ధోని…!

పంత్ లా మారిపోయిన ధోని…!

by Azhar
Ad

భారత జట్టులో మహేంద్ర సింగ్ ధోని తనదైన ముద్ర అనేది వేసాడు అని అందరూ ఒప్పుకుంటారు. కెప్టెన్ గా ధోని సాధించిన విజయాలు ఎన్నో. వాటన్నిటికీ ప్రతీకగా ధోని కెప్టెన్సీలో భారత జట్టు అందుకున్న మూడు ఐసీసీ టైటిల్స్ అనేవి చూపిస్తారు. ఇక బ్యాటర్ గా ఇండియాకు బెస్ట్ ఫినిషర్ గా నిలిచిన ధోని.. వికెట్ కీపర్ గా అనేక రికార్డులు అనేవి సొంతం చేసుకున్నాడు. అయితే 2016 లో టీం ఇండియా కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత కూడా మూడేళ్లు జట్టులో ఉండి 2019 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి కూడా తప్పుకున్నాడు.

Advertisement

అయితే ప్రస్తుతం కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతూ… లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ధోని… ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్నాడు. తన 12వ పెళ్లి రోజుతో పాటుగా పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి కుటుంబంతో కలిసి ధోని ఇంగ్లాండ్ కు వెళ్ళాడు. ఇక ఇదే సమయంలో మన భారత జట్టు కూడా ఇంగ్లాండ్ లోనే ఉంది. ప్రస్తుతం అక్కడ ఇంగ్లిష్ జట్టుతో మూడు టీ20 సిరీస్ ల మ్యాచ్ లో తలపడుతుంది. ఇక నిన్న రెండో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని భారత జట్టు డ్రెసింగ్ రూమ్ లోకి వచ్చాడు. కానీ ధోని వచ్చిన విధానంతో అక్కడ ఉన్నవారు అందరూ షాక్ అయ్యారు.

Advertisement

ధోని పంత్ మాస్క్ తో వచ్చినట్లు తెలుస్తుంది. మొదట పంత్ మాస్క్ తో బయట అభిమానులకు ఫోటోలు ఇచ్చిన ధోని అలాగే రావడంతో అందరూ షాక్ అయ్యారట. అయితే ప్రస్తుతం కరోనా నియమాలు లేకపోవడంతో ధోని డ్రెసింగ్ రూమ్ లోకి వచ్చి అక్కడ ఆటగాళ్లతో మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. అయితే ధోని తర్వాత భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ప్రధాన కీపర్ గా మారిన పంత్.. ప్రస్తుతం బ్యాటింగ్ లో అదరగొడుతున్న విషయం అందరికి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

జింబాబ్వేకు భారత జట్టు.. ఇంకో కొత్త కెప్టెనా..?

నేను చెప్పను అని ఇంగ్లిష్ మీడియాకు చెప్పిన భువనేశ్వర్…!

Visitors Are Also Reading