Home » కోహ్లీని టీ20ల్లో నుండి తప్పించాలి అంటున్న జడేజా..!

కోహ్లీని టీ20ల్లో నుండి తప్పించాలి అంటున్న జడేజా..!

by Azhar
Ad

రన్ మిషన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం డీలా పడిపోయిన విషయం తెలిసిందే. వరుస మ్యాచ్ లలో విఫలమవుతూ.. విమర్శల పాలవుతున్నాడు విరాట్ కోహ్లీ. గత మూడేళ్ళుగా సెంచరీ అనేది చేయని విరాట్… ప్రస్తుతం కనీసం క్రీజులో కూడా నిలబడలేకపోతున్నాడు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాడు. ఐపీఎల్ 2022 లో దారుణంగా విఫలమైన విరాట్.. కొంత విశ్రాంతి తర్వాత ఇప్పుడు భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా ఆడిన టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ ప్లాప్ అయ్యాడు.

Advertisement

ఇక ఈ టెస్ట్ తర్వాత టీ20 సిరీస్ అనేది ప్రారంభమైంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఆడని విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్ లో తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత మూడో బంతికే ఒక్క పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో మళ్ళీ విమర్శలు అనేవి ప్రారంభమయ్యాయి. తాజాగా టీం ఇండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా మాట్లాడుతూ.. కోహ్లీని టీ20 జట్టు నుండి తప్పించాలని పేర్కొన్నారు. జడేజా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… కోహ్లీని గతంలో ఇలా ఆడుతున్నప్పుడు ఎప్పుడు చూడలేదు. ఎవరో తన వెనుక ఉండి ఒత్తిడి చేస్తున్నట్లు కనిపించాడు.

Advertisement

ఈ మ్యాచ్ లో ఎవరో తనను భారీ షాట్స్ ఆడమానీ చెప్పినట్లు.. అనవసరంగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. కోహ్లీ ఎప్పుడు కూడా ఇలా వచ్చిన వెంటనే దూకుడుగా ఆడింది నేను చూడలేదు. కోహ్లీ బ్యాటింగ్ లో మార్పులు అనేవి చాలా వచ్చాయి. అతను చాలా ఒత్తిడికి లోనవుతున్నాడు అని అనిపిస్తుంది. కాబట్టి అతడిని టీ20ల నుండి తప్పించాలి. నేను ఒకవేళ టీ 20 జట్టును ఎంపిక చేసే వాడిని అయితే కోహ్లీని తప్పకుండ ఎంపిక చేసి ఉండేవాడిని కాదు అని జడేజా పేర్కొన్నాడు. అయితే ఒకేవలా కోహ్లీ ఈ పర్యటనలో రాణించకపోతే అతను ఇంకా టీం ఇండియాలో ఉండటం కష్టమే అనే వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

నేను చెప్పను అని ఇంగ్లిష్ మీడియాకు చెప్పిన భువనేశ్వర్…!

పంత్ లా మారిపోయిన ధోని…!

Visitors Are Also Reading