Home » చంద్రబాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్న నన్నపనేని రాజకుమారి..

చంద్రబాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్న నన్నపనేని రాజకుమారి..

by Mounika
Ad

టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చంద్రబాబు అరెస్టు పట్ల మాట్లాడుతూ మీడియా సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. రాష్ట్రంలో లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించారు అని విమర్శించారు రాజకుమారి. చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్య అని,  ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని తెలిపారు. ఒక ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చిన వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ అధికారపక్షం పై మండిపడ్డారు.

Advertisement

యువగళం బ్రహ్మాండంగా జరుగుతుండడంతో చంద్రబాబుపై ఈ రీతిగా చర్య తీసుకున్నారని విమర్శించారు .పాదయాత్రని ఎవరు ఆపలేరు, మళ్లీ ప్రారంభమవుతుంది. కచ్చితంగా చంద్రబాబు పర్యటనలు మళ్ళీ జరుగుతాయని  కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి మాట్లాడుతూ నన్నపనేని రాజకుమారి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ భువనేశ్వరి గారిని చూస్తే చాలా బాధనిపించిందని, ఆమె ధైర్యంగా ఉండాలని, త్వరలోనే చంద్రబాబు మళ్ళీ నవ్వుతూ అందరి మధ్య వస్తారని చెబుతూ భావోద్వానికి లోనయ్యారు రాజకుమారి. ప్రజలు అవకాశం కల్పించినప్పుడు సద్వినియోగం చేసుకోవాలే గాని ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు అని వైసిపి పార్టీపై  మండిపడ్డారు.

Advertisement

 ఇక చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ కావడంతో జాతీయ నాయకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అరెస్టుపై నిరసన తెలియజేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు టిడిపిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న  ఒక వ్యక్తిని ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం తప్పని ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

Also Read :

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి వివాద సమస్యలు పరిష్కారమవుతాయి

నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన కొన్ని ఆరోగ్య సూత్రాలు…!

చంద్రబాబు నాయుడు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

Visitors Are Also Reading