Home » మళ్ళీ కొంపముంచిన కేఎల్ రాహుల్…!

మళ్ళీ కొంపముంచిన కేఎల్ రాహుల్…!

by Azhar
Ad

భారత జట్టు స్టార్ ఓపెనర్ మరోసారి అభిమానులను ఆశలను అడియాశలు చేసాడు కేఎల్ రాహుల్. ఎప్పటినుండో భారత జట్టు తరపున ఆడుతూ.. ఒక్క సిరీస్ తర్వాత మరో సిరీస్ కు గాయపడుతూ వస్తున్నాడు రాహుల్. అయితే రోహిత్ శర్మతో జట్టు కెప్టెన్ గా ముందువరుసలో ఉన్న కేఎల్ రాహుల్ ఇలా గాయపడటం అనేది అందరిని కలవరపెడుతుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత ఇండియా పర్యటనకు వచ్చినా సౌత్ ఆఫ్రికా జట్టుతో తలపడిన సిరీస్ నుండి రోహిత్ రెస్ట్ తీసుకోవడంతో రాహు కు కెప్టెన్సీ ఇచ్చారు. కానీ సిరీస్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు రాహుల్ గాయపడ్డాడు.

Advertisement

అందువల్ల అతని స్థానంలో ఈ సిరీస్ కు పంత్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే రాహుల్ గాయపు ఈసారి కొంత తీవ్రతరం కావడంతో అతను చికిత్స కోసం జర్మనీ వెళ్ళాడు. అందువల్ల ఐర్లాండ్ పర్యటన అలాగే ఇంగ్లాండ్ పర్యటనలకు కూడా కేఎల్ రాహుల్ దూరం కావాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ఇండియాకు వచ్చినా కేఎల్ రాహుల్.. ఎన్సీఏలో ప్రాక్టీస్ అనేది ప్రారంభించాడు. ఆ క్రమంలో వెస్టిండీస్ పర్యటనకు వచ్చే టీ20 జట్టుకు రాహుల్ ను ఎంపిక చేసి.. ఫిట్నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో అక్కడే ఎన్సీఏ లో ఉన్న సమయంలో రాహుల్ కు కరోనా సోకింది.

Advertisement

ఇక ఈ కారణంగా మళ్ళీ రాహుల్ విండీస్ పర్యటనకు దూరం కానున్నాడు అని వార్తలు రాగ.. ఇప్పుడు అవి నిజం అయ్యాయి. అయితే నిన్నే మన టీ20 జట్టు ఆటగాళ్లు విండీస్ కు వెళ్లగా అందులో రాహుల్ లేడు. ఎందుకంటే అతడిని పరీక్షించిన వైద్యులు.. రాహుల్ కు కనీసం వరం రోజులు రెస్ట్ కావాలని చెప్పారు. అందువల్ల అతడిని మధ్యలో విండీస్ పంపుదాం అని మొదట భావించింది బీసీసీఐ. కానీ మధ్యలో విండీస్ కు పంపడం కంటే.. పూర్తిగా రెస్ట్ ఇచ్చి.. జింబాంబ్వే పర్యటనకు పంపాలని డిసైడ్ అయ్యారు సెలక్టర్లు.

ఇవి కూడా చదవండి :

ఆ కోచ్ వల్ల ఏం కాదు అంటున్న శ్రీశాంత్…!

రోహిత్, ధావన్ మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!

Visitors Are Also Reading