Home » నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి ప్రధాని మోడీ ఏమన్నారంటే..?

నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి ప్రధాని మోడీ ఏమన్నారంటే..?

by Anji
Ad

లోకసభలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. నెహ్రూ భారతీయులను సోమరులని పిలిచేవారని..ఇందిరాగాంధీ ఆలోచన కూడా చాలా భిన్నంగా ఉండేవన్నారు. దేశ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదన్నమోదీ గాంధీ కుటుంబాన్ని రాజకుటుంబంగా అభివర్ణించారు.రాష్ట్రపతి ప్రసంగంపై  ‘ధన్యవాద తీర్మానం’ సందర్భంగా ప్రధాని మోదీ దాదాపు 2 గంటలపాటు సాగిన ప్రసంగంలో, భారతీయులు కష్టాల నుండి పారిపోతారనే వ్యాఖ్యపై మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై కూడా ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

Advertisement

ప్రధాని నెహ్రూ ఎర్రకోట నుంచి ఏం చెప్పారో నేను చదువుతాను అంటూ ప్రారంభించారు. భారతీయులకు సాధారణంగా చాలా కష్టపడి పనిచేసే అలవాటు లేదు, యూరప్ లేదా జపాన్ లేదా చైనా లేదా రష్యా లేదా అమెరికా ప్రజలలాగా మనం పని చేయము అంటూ ఎగతాళి చేశారంటూ గుర్తు చేశారు. ఇందిరాగాంధీ ఆలోచన కూడా నెహ్రూ ఆలోచనకు భిన్నంగా లేవన్నారు ప్రధాని మోడీ. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఎర్రకోట ప్రాకారాల నుంచి మాజీ ప్రధాని చెప్పిన కోట్‌ను ప్రస్తావించారు. దురదృష్టవశాత్తూ, మన అలవాటు ఏమిటంటే, కొన్ని శుభ కార్యాలు పూర్తి చేయబోతున్నప్పుడు, మనం ఆత్మ సంతృప్తి చెందుతాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం కాస్త  నిరాశ చెందుతాం. కొన్నిసార్లు దేశం మొత్తం విఫలమైనట్లు అనిపిస్తుంది. మనం ఓటమి భావనను స్వీకరించినట్లు అనిపిస్తుంది అని ఇందిరా గాంధీని ఉటంకిస్తూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Visitors Are Also Reading