Home » ట్రక్కు డ్రైవర్లకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్.. డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలు..!

ట్రక్కు డ్రైవర్లకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్.. డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలు..!

by Anji
Ad

లారీ, ట్రక్ డ్రైవర్లకు శుభవార్త చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని మోడీ ప్రతిపాదించారు.  ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024కి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని  ప్రసంగించారు.  ఆటోమోటివ్ ఎకోసిస్టమ్‌లో డ్రైవర్ల ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు.డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి త్వరలో 1000 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

భోజనం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి పార్కింగ్ సదుపాయాలు ఉండేలా ఈ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తామన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ట్రక్, టాక్సీ డ్రైవర్లు మన సామాజిక , ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగమని ప్రధాని మోదీ తన ప్రసంగంలో అన్నారు. డ్రైవర్లు కొన్నిసార్లు గంటల తరబడి ట్రక్కులు నడుపుతూ ఉంటారు. ఈ సమయంలో వారు అస్సలు విశ్రాంతి తీసుకోలేరు. డ్రైవర్ల ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద అన్ని జాతీయ రహదారుల వెంబడి ఆధునిక భవనాలు నిర్మించనున్నారు. డ్రైవర్లు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారన్నారు.

Advertisement

 

2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా వేగంగా దూసుకుపోతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.  ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో మొబిలిటీ రంగానికి పెద్ద సహకారం ఉంది. దీంతో పాటు తొలి ప్రభుత్వ హయాంలో గ్లోబల్ లెవల్ మొబిలిటీ కాన్ఫరెన్స్ నిర్వహించామని తెలిపారు. ఇందులో బ్యాటరీలు, ఈవీల గురించి కూలంకషంగా చర్చించారు. నేను రెండవ టర్మ్‌లో వేగవంతమైన పురోగతిని చూస్తున్నాను అని మోడీ తెలిపారు.  ఎర్రకోట ప్రాకారాల మీద నుంచి ‘Yahi Samay, Sahi Samay hai’ అనే మాటను అన్నానని.. దేశ ప్రజల సామర్ధ్యాల వల్లే ఆ మాటలు అన్నాను అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

 

Visitors Are Also Reading