Home » పల్లవి ప్రశాంత్ పై నెటిజన్లు ఆశ్చర్యకర కామెంట్స్.. మరీ ఎక్కువైందంటూ..!

పల్లవి ప్రశాంత్ పై నెటిజన్లు ఆశ్చర్యకర కామెంట్స్.. మరీ ఎక్కువైందంటూ..!

by Anji
Ad

బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ రచ్చ రచ్చ అయింది. పల్లవి ప్రశాంత్, ఆట సందీప్ నడుమ మాటల యుద్ధం జరిగింది. అంతకుముందు శివాజీని యాక్టివిటీ రూమ్‍లోకి పిలిచాడు బిగ్ బాస్. చేయి గురించి ఆరా తీశాడు. కాసేపు బయటకు వచ్చి.. స్కానింగ్ తీయించుకోవాలని చెప్పాడు. ఇదే విషయం హౌస్ మేట్స్ అందరికీ చెప్పాలని తెలిపాడు. శివాజీ వెళ్లి ఇదే విషయంపై చెప్పగా ..  అందరూ శివాజీ వెళ్లిపోతున్నాడేమో అనుకున్నారు. కానీ స్కానింగ్ అయిపోయాక మళ్లీ వచ్చాడు శివాజీ.  ప్టెన్ యావర్ కు వీఐపీ రూమ్ కేటాయించాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్లో ఇద్దరినీ డిప్యుటీలుగా ఎంచుకోవాలని తెలుపగా.. శివాజీ, సందీప్ ను తీసుకున్నాడు యావర్.

Advertisement

వారు కూడా వీఐపీ రూమ్ లో నిద్రపోతారు. స్పైట్ కూలర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ వారం ఎవరు ఎక్కడ నిద్రపోవాలో, రేషన్ సరిపడేలా చూసుకోవడంలో యావర్‍తో పాటు శివాజీ, సందీప్ నిర్ణయాలు తీసుకుంటారు.  సాధారణంగా ఓ  సామాన్యుడిగా రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ మొదటి రెండు వారాలలో బాగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. రెండవ వారంలో అమర్ చేసిన పనికి పల్లవి ప్రశాంత్ కు బాగా ప్లస్ అయింది. అప్పటి నుండి శివాజీ సహాయంతో చిన్న చిన్నగా టాస్కులు ఆడుకుంటూ హౌస్ మెట్ అయ్యాడు మరియు కెప్టెన్ గా కూడా ఎంపికయ్యాడు.

Advertisement

ఆ తర్వాత ఇతనిలో వచ్చిన మార్పులు మాములుగా లేవని చెప్పాలి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే నిన్న నామినేషన్స్ లో సందీప్, తేజ లతో వ్యవహరించిన తీరు. ఎవ్వరికీ భయపడను , బరా బర్ చెబుతాను, నేనింతే, నాపేరు పల్లవి ప్రశాంత్.. అంటూ చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్లు బాగా కోపంగా ఉన్నారు.  మరీ సందీప్ తో అయితే చాలా దారుణంగా వధించాడు.. సందీప్ ప్లేస్ లో ఇంకెవ్వరు ఉన్నా చాలా గొడవ అయ్యేది అంతలా తనను రెచ్చగొట్టాడు ప్రశాంత్. ఇక మీదట హౌస్ లో ఈ విధంగా బెహేవ్ చేస్తే ప్రేక్షకులు ఇంటికి సాగనంపడం ఖాయం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 బిగ్ బాస్ షోను నాగార్జున చూస్తారా? చూడరా? అసలు నిజం వెల్లడి..!

లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ మొదటి చిత్రం ‘నగరం’ అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?

Visitors Are Also Reading