Home » మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉందా..వెంటనే దారంతో ఇలా చేయండి..!!

మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉందా..వెంటనే దారంతో ఇలా చేయండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచడం చాలా మంచిది అంటుంటారు వాస్తు నిపుణులు. ఈ మొక్క ఉండడం వల్ల మన ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుందని వారు చెబుతుంటారు. ఈ మనీ ప్లాంట్ మొక్క వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ఇంట్లో సుఖశాంతులతో అందరూ ఆరోగ్యంగా ఉంటారట. మన ఇంట్లో ఈ మొక్కను ఏ వైపున పెడితే మనకు సంపూర్ణ ఆరోగ్యం ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనే విషయం చాలా మందికి తెలియదు. మనీ ప్లాంట్ మొక్కను సరైన స్థలంలో ఉంచకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఆ మొక్కను ఏ దిశలో పెట్టాలో తెలుసుకుందాం..


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్క ను ఆగ్నేయ దిశలో నాటాలి. వినాయకుడు ఈ దిశలో మంచిని సూచించే దేవుడు కనుక ఈ దిశలో ఆ మొక్కను పెట్టడం వల్ల మనకు పుణ్యఫలం వస్తుంది. అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడు కూడా భూమిని తాకకుండా చూసుకోవాలి. ఈ మొక్క పెరుగుతున్న క్రమంలో ఆ తీగలను తాడుతో కట్టి పందిరిలా అల్లుకునేలా చేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పెరుగుతున్న ఈ మనీ ప్లాంట్ మొక్క శుభసూచకమని, ఈ మొక్క ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే అని నమ్ముతారు.

Advertisement

Advertisement

ఈ మొక్క ని ఎప్పుడైనా సరే ఈశాన్య దిశలో అస్సలు పెట్టకూడదు. దీని వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. మనీ ప్లాంట్ మొక్కలు ఎప్పుడు కూడా ఎండిపోకుండా కాపాడుకోవాలి. ఒకవేళ ఎండిపోతే మాత్రం ఇంట్లో అశుభమే. ఈ మొక్కను పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వారు చెబుతున్నారు. శుక్రవారం రోజున మనీప్లాంట్ మొక్కకి ఎర్రని దారాన్ని కడితే శుభం కలుగుతుంది. ఎరుపు రంగు విజయానికి సంకేతం కాబట్టి ఈ మొక్కకు ఎర్రటి దారం కట్టాలి. దీని వల్ల ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో ఆరోగ్యంగా జీవిస్తారని వాస్తు పండితులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading