Home » ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేసిన కోహ్లీ,నవీన్… వీళ్లకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అంటూ ట్రోలింగ్!

ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేసిన కోహ్లీ,నవీన్… వీళ్లకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అంటూ ట్రోలింగ్!

by Bunty
Ad

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ మరియు టీమిండియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రెండవ విజయాన్ని అందుకుంది టీమిండియా. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 272 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది మన టీమ్ ఇండియా జట్టు.

Memes On Virat Kohli And Naveen-Ul-Haq Hug Break The Internet

Memes On Virat Kohli And Naveen-Ul-Haq Hug Break The Internet

అయితే ఆఫ్ఘనిస్తాన్ మరియు టీమిండియా జట్ల మధ్య మ్యాచ్ అంచనాలను తలకిందులు చేసింది. ఈ మ్యాచ్ ముందు వరకు శత్రువులుగా ఉన్న విరాట్ కోహ్లీ మరియు నవీన్ ఉల్ హక్ మ్యాచ్ అనంతరం మిత్రులుగా మారిపోయారు. ఈ మ్యాచ్లో కోహ్లీ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ నవీన్ మధ్య ఫైట్ కోసం ఎంతో ఆసక్తిగా చూశారు. కానీ అనుభవంగా వారిద్దరు నవ్వుతూ పలకరించుకొని… మ్యాచ్ అయ్యాక సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.

Advertisement

Advertisement

దీంతో ఇటు కోహ్లీ ఫ్యాన్స్ అలాగే అటు నవీన్ సపోర్టర్స్ షాక్ అయ్యారు. అంటే మీరు మీరు… ఒకటే మధ్యలో మేమే ఫూల్స్ అయ్యాం అంటూ సోషల్ మీడియాలో కొంతమంది మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ అనంతరం నవీన్ మాట్లాడుతూ… విరాట్ కోహ్లీ చాలా గొప్ప బ్యాట్స్మెన్ అని కొనియాడాడు నవీన్. మ్యాచ్ మధ్యలో తాము కరచాలనం చేసుకున్నాం… ఇప్పటివరకు మా మధ్య జరిగిన వివాదాలు తొలగిపోయాయి… ఇకనుంచి మేము ఇద్దరం కలిసికట్టుగా ఉంటామని నవీన్ వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading