టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమా ఏదైనా తను నచ్చితే కచ్చితంగా కామెంట్ చేస్తూ.. ఆ చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తారు. చిన్న, పెద్ద స్టార్స్ అని తేడా లేకుండా సినిమాని వీక్షించి ట్విట్టర్ లో తనదైన స్టైల్ లో రివ్యూ ఇస్తుంటాడు. కేవలం రివ్యూలు మాత్రమే కాదు.. స్పెషల్ విషెస్, బర్త్ డే విషెస్ ఇలా ఏదైనా గుర్తుకు పెట్టుకొని మరీ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటాడు.
Also Read : Amigos OTT : ఆ ఓటీటీలోకి వచ్చేసిన అమీగోస్… లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే!
Advertisement
తాజాగా మహేష్ బాబు శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన దసరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలైంది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ‘దసరా సినిమా స్టన్నింగ్ గా ఉంది. టీమ్ ను చూస్తుంటా చాలా గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం SSMB 28 మూవీలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Advertisement
So so proud of #Dasara!! Stunning cinema! 🔥🔥@NameisNani @KeerthyOfficial @Dheekshiths @thondankani @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP
— Mahesh Babu (@urstrulyMahesh) March 31, 2023
దసరా చిత్ర బృందాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించడంతో నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయనున్నాడా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇప్పటివరకు మహేష్ బాబు కొత్త దర్శకుడితో నేరుగ ఏ సినిమా చేయలేదు. ఏదైనా సినిమా తీసి మంచి హిట్ సాధించిన దర్శుడితోనే సినిమా తీశాడు. దసరా సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో దసరా దర్శకుడితో మహేష్ బాబు సినిమా తీయనున్నాడా అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వాస్తవానికి మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా తరువాత రాజమౌళితో గ్లోబల్ స్థాయిలో సినిమా చేయనున్నాడు. శ్రీకాంత్ ఓదెలతో చేస్తాడో లేదో తెలియాలంటే వేచి చూడాలి మరి.
Also Read : షారూఖ్ ఖాన్ ని అధిగమించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?