Home » దేశంలో పాపులర్ ముఖ్యమంత్రుల జాబితా.. ఏపీ సీఎం జగన్‌ ది ఎన్నో స్థానం అంటే..?

దేశంలో పాపులర్ ముఖ్యమంత్రుల జాబితా.. ఏపీ సీఎం జగన్‌ ది ఎన్నో స్థానం అంటే..?

by Anji
Ad

దేశంలో అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితా ఒకటి తాజాగా వెల్లడి అయింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించినటువంటి సర్వేలో అత్యంత ప్రజాదారణ కలిగిన సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 52.7 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. వివాద రహితుడుగా ఉన్న నవీన్ పట్నాయక్ కి ప్రజలు బెస్ట్ సీఎంగా పట్టం కట్టారు. ఇక ఆ తరువాత స్థానంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. ఈయనకు 51.3 శాతం మంది ప్రజలు రేటింగ్ ఇచ్చారు.

Advertisement

Advertisement

ఇక ఆ తరువాత స్థానంలో 48.6 శాతం ఓట్లతో అస్సాం సీఎం హింత బిస్వాశర్మ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ 42.6 శాతం ఓట్లు.. త్రిపుర సీఎం మాణిక్ సాహుకు 41.4 శాతం ఓట్లు దక్కాయి.  మాణిక్ సాహు  ప్రజాదారణ కలిగిన సీఎంల జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఆరో స్థానంలో 41.1 శాతం ఓట్లతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ 40.1 శాతం ఓట్లతో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిలు ఈ జాబితాలో ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఎనిమిదో స్థానం దక్కింది. ఈయనకు 36.5 శాతం మాత్రమే రేటింగ్ వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కి 35.8 శాతం రేటింగ్ తో తొమ్మిదో స్థానంలో నిలువగా.. 32.8 శాతం ఓట్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదో స్థానంలో నిలిచారు. ఈ  జాబితాలో గత నాలుగున్నరేళ్లుగా సీఎం ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చోటే దక్కకపోవడం గమనార్హం.

Also Read : కుర్చీ మడతపెట్టడం కాదు.. ఏకంగా విరగొట్టాడు.. జైస్వాల్‌ సిక్సర్‌కు ఛైర్‌ ధ్వంసం..!

Visitors Are Also Reading