Home » కేటీఆర్‌ ను ఓడించేందుకు డబ్బులు పంపించిన జగన్‌..?

కేటీఆర్‌ ను ఓడించేందుకు డబ్బులు పంపించిన జగన్‌..?

by Bunty
Published: Last Updated on
Ad

భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్… మొట్టమొదట సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2009 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ బై ఎలక్షన్స్ లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేవలం 184 ఓట్ల తేడాతో విజయం సాధించారు కేటీఆర్.

KTR Shocking Comments On Cm jagan

KTR Shocking Comments On Cm jagan

అయితే తన విజయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించారని… బాంబు పేల్చారు మంత్రి కేటీఆర్. 2009 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ బై ఎన్నికల తర్వాత… 9 నెలలకే అంటే 2010లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేటీఆర్ రాజీనామా చేశారు. అయితే 2010లో జరిగిన అసెంబ్లీ బై ఎన్నికలలో… మంత్రి కేటీఆర్ మరోసారి విజయం సాధించారు.

Advertisement

Advertisement

అయితే 2010లో జరిగిన ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారట. దీంతో కేటీఆర్ ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించినట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు కేటీఆర్. అయితే ఈ విషయాన్ని తన పార్టీలోని ఒక వ్యక్తి చెప్పినట్లు తెలిపారు కేటీఆర్. మహిళలకు ఒక్కొక్కరికి 600 రూపాయల చొప్పున ఆ సమయంలో డబ్బులు పంచారట. కానీ ఆ డబ్బులు తీసుకున్న మహిళలు తనకు మాత్రమే ఓటు వేసి గెలిపించాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలలో వాస్తవం ఎంత ఉందో తెలియదు.

ఇవి కూడా చదవండి

 

Visitors Are Also Reading