Home » టీమిండియాను ఓడిస్తే, డేట్‌ చేస్తా… బంగ్లా ఆటగాళ్లకు పాక్‌ నటి ఆఫర్‌

టీమిండియాను ఓడిస్తే, డేట్‌ చేస్తా… బంగ్లా ఆటగాళ్లకు పాక్‌ నటి ఆఫర్‌

by Bunty
Ad

భారత్-పాకిస్తాన్ ఆడిన తొలి మ్యాచ్లో పాక్ పై భారత్ ఘనవిజయం సాధించింది. 191 పరుగులకి కుప్పకూలిన బాబర్ సేనను రోహిత్ చీల్చి చెండాడాడు. సిక్సుల వర్షం కురిపించి 86 పరుగులతో పాక్ పతనాన్ని శాసించాడు. సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇప్పటికే టీమిండియా విజయం ఖాయం అయింది. శ్రేయస్ అయ్యర్ అజేయ హాఫ్ సెంచరీతో మ్యాచ్ ను ముగించాడు. అయితే పాక్ చిత్తుగా ఓడిపోవడాన్ని పాక్ నటి సేహర్ షిన్వారి భరించలేకపోతోంది.

Pakistani Actress Makes Bold Promise If Bangladesh Beat India In Cricket World Cup 2023

Pakistani Actress Makes Bold Promise If Bangladesh Beat India In Cricket World Cup 2023

టీం ఇండియాను ఎవరైనా దెబ్బకొడితే చూడాలని ఆరాటపడుతుంది. ఈరోజు టీం ఇండియా – బంగ్లాదేశ్ తలపడనున్నాయి. వరుస విజయాలతో జోరుమీద ఉన్న రోహిత్ సేన బంగ్లాదేశ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు వరుస ఓటములతో నిరాశలో ఉన్న బంగ్లా ఆటగాళ్లు టీమిండియాపై నెగ్గెందుకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో పాకిస్తాన్ నటి సేహర్ షిన్వారి బంగ్లా క్రికెటర్లకు సవాల్ విసిరింది. టీమిండియాపై బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని కోరింది. ఇండియాను ఓడిస్తే డాకా నగరానికి వచ్చి బంగ్లాదేశ్ టీం లోని ఓ క్రికెటర్ తో ఫిష్ డిన్నర్ చేస్తానని ఆఫర్ ఇచ్చింది.

Advertisement

Advertisement

దీన్ని బట్టి చూస్తుంటే ఇండియా ఎలాగైనా ఓడిపోవాలని…. పాకిస్తాను నువ్వు చిత్తు చేసినందుకుగాను ఈ అమ్మడు ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతుంది. ఇది ఇలా ఉండగా… వన్డే వరల్డ్ టోర్నీలో భారత జట్టుకు బంగ్లాదేశ్ పై మంచి రికార్డు ఉంది. కానీ 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో మొట్టమొదటిసారి ఐదు వికెట్ల తేడాతో భారత్ ఓడింది. ఆ తర్వాత 2011-2015 వన్డే వరల్డ్ కప్ లో భారత్ బంగ్లాపై భారీ తేడాతో విజయాన్ని సాధించింది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading