రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపులో భాగం అయినటువంటి జియో 2023 ఐపీఎల్ 16వ సీజన్ లో సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ పోస్ట్ పెయిడ్ ప్లాన్. నెలకు రూ.599తో రిచార్జీ చేస్తే కస్టమర్లు, అన్ లిమిటేడ్ కాల్స్, అన్ లిమిటేడ్ డేటాను పొందవచ్చు అని తెలిపింది. ఈ ప్లాన్లో కస్టమర్లు 4జీ డేట పొందుతారు. అదేవిధంగా 5జీ డేటా అందుబాటులో ఉన్న వారు కూడా అన్ లిమిటేడ్ గా కూడా వాడుకోవచ్చు.
Advertisement
Also Read : చక్రి చనిపోయిన తరవాత ఆయన భార్య ఎక్కడ ఉన్నారో తెలుసా..? ఏం చేస్తున్నారంటే.?
Advertisement
కాల్స్ ఎన్ని అయినా చేసుకునే వీలు ఉంది. ఈ ప్లాన్ లో రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు. ప్రస్తుతం ఎస్ఎంఎస్ పంపించుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎస్ఎంఎస్ ల వాడకం బాగా పడిపోయింది. ఈ ఆప్షన్ అంత ఉపయోగపడకపోవచ్చు. ఈ ప్లాన్ లో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్ సేవలను ఉచితంగా పొందవచ్చు.
Also Read : ఎండాకాలంలో గుడ్లు ఎక్కువగా తింటే ప్రమాదమా ? నిపుణులు ఏమంటున్నారంటే ?
ప్రీపెయిడ్ లో ఈ ప్లాన్ అందుబాటులో లేదు కాబట్టి ఈ ప్లాన్ పొందాలనుకునే ప్రీపెయిడ్ కస్టమర్లు పోస్ట్ పెయిడ్ కి మారాల్సి ఉంటుంది. కొత్త కస్టమర్లకు జియో ఈ ప్లాన్ ని 30 రోజుల పాటు ఉచితంగా ట్రయల్స్ అందిస్తోంది. మొత్తానికి రోజుకు రూ.19 ఖర్చుతో అన్ లిమిటేడ్ కాల్స్, అన్ లిమిటేడ్ డేటా పొందే అవకాశం ఉందని జియో కంపెనీ స్పష్టం చేసింది. ఇంకెందుకు ఆలస్యం అన్ లిమిటేడ్ నెట్ కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Advertisement
Also Read : రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు చేయకూడని పనులు ఇవే..!