Home » ఆ టాలీవుడ్ హీరోతో నటించాలని ఉందంటున్న‌ జాన్వి కపూర్..!

ఆ టాలీవుడ్ హీరోతో నటించాలని ఉందంటున్న‌ జాన్వి కపూర్..!

by Anji
Ad

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాన్వి కపూర్ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. “ధడక్” చిత్రంతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. జాన్వి ఇటీవల “గుడ్ లక్ జెర్రీ” మూవీ సక్సెస్ తో నటిగా మరింత పేరుని అందుకుంది.

Also Read : విజయ్ దేవరకొండ పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?

Advertisement

అదేవిధంగా అక్షయ్ కుమార్, టైగర్ స్రాఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ” బడే మియా చోటే మియా”. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. టైగర్ సరసన జాన్వి కపూర్ నటించనుందని.. ఆ చిత్రంలో పాత్ర కోసం జాన్వినే దర్శకుడు అబ్బాస్ కోరుకుంటున్నాడని చిత్రవర్గాలు చెబుతున్నాయి. వచ్చేనెల లండన్ లో జరగనున్న షెడ్యూల్లో జాన్వి పాల్గొనబోతున్నట్లులు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.

Advertisement

Also Read : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఆర్జీవీ సినిమా ?

టాలీవుడ్ లో తనకి ఆ హీరోతో నటించాలని ఉన్నట్టు చెప్పుకొచ్చింది. నేటి టాలీవుడ్ యువనటుల్లో అందరూ తనకు ఇష్టమైన వారేనని.. ఒకవేళ తనకి అవకాశం వస్తే మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటని బయటపెట్టింది. ఇటీవల విడుదలైన ఆర్.ఆర్.ఆర్ మూవీ చూశానని.. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చింది. ఇక ఎన్టీఆర్ తో నటించాలనే ఆమె కల నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

Also Read : బ్రిట‌న్ ప్ర‌ధాని రిషిసునాక్ భార్య ఎవ‌రో తెలుసా..? ఎలా ఒక్కటయ్యారంటే..?

 

Visitors Are Also Reading