Home » సాయి పల్లవి వాళ్ళ చేతిలో మోసపోయిందా…?

సాయి పల్లవి వాళ్ళ చేతిలో మోసపోయిందా…?

by Azhar
Ad
టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్స్ లలో ఒక్కరిగా కొనసాగుతుంది సాయి పల్లవి. ఆమె నటించిన మొదటి సినిమా ఫిదాతోనే ఆమెకు అభిమానుల్లో క్రేజ్ అనేది విపరీతంగా వచ్చింది. ఇక అప్పటి నుండి ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు అనేవి సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే ఆమె బయట వ్యవరించే తీరు.. సినిమాల విషయంలో ఆమెకు ఉండే క్లారిటీ.. డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేయకపోవడం అనేవి ఆమె క్రేజ్ ను మరింతగా పెంచేసాయి. అందువల్ల ఆమె ఎక్కడికి వెళ్లిన కూడా ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తారు.
ఈ క్రమంలోనే ఆమె చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు సుకుమార్ సాయి పల్లవిని లేడి పవర్ స్టార్ గా పిలిచాడు. అయితే అప్పుడు ఆ కామెంట్స్ అనేవి కొంత విమర్శలకు గురైన తర్వాత అభిమానులు కూడా అందరూ ఆమెను లేడి పవర్ స్టార్ గా గుర్తించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె తాజా సినిమా అయిన విరాట్ పర్వం చిత యూనిట్ అనేది ఈ లేడి పవర్ స్టార్ అనే బిరుదును మరింత ప్రమోట్ చేసింది.  కానీ ఇలా పిలవడం సాయి పల్లవికి ఇష్టం లేదు అని తెలుస్తుంది.
అయిన కూడా ఫ్యాన్స్ అందరూ అలానే పిలవడంతో తన క్రేజ్ చూసి… కమర్షియల్ కాకపోయినా తన సినిమాలో ఫ్యాన్స్ చూస్తారు అనే ఆలోచనతో ఈ మధ్య సాయి పల్లవి మొత్తం పాత్రకు ప్రాముఖ్యం ఉండే సినిమాలు చేస్తుంది. కానీ ఫ్యాన్స్ ఆ సినిమాలను ఒప్పుకోవడం లేదు. ఈ మధ్యే సాయి పల్లవి ప్రధాన పాత్రలో వచ్చిన గార్గి కూడా అంతగా ఆడలేదు. దాంతో అభిమానులపై సాయి పల్లవి పెట్టుకున్న నమ్మకం పనిచేయలేదు. అందువల్ల వారి చేతిలో సాయి పల్లవి మోసపోయినట్లై అయ్యింది అని సోషల్ మీడియాలో వార్తలు అనేవి వస్తున్నాయి. అయిన కూడా సాయి పల్లవి వెనక్కి తగ్గడం లేదు.

Advertisement

Visitors Are Also Reading