Home » క్రేజ్ లో కోహ్లీని కొట్టే వ్యక్తి లేడుగా..!

క్రేజ్ లో కోహ్లీని కొట్టే వ్యక్తి లేడుగా..!

by Azhar
Ad

విరాట్ కోహ్లీ అంటేనే ఒక్క బ్రాండ్ అనే విషయం అందరికి తెలిసిందే. ఈ పేరును వాడుకొని చాలా మంది బ్రతుకుతున్నారు . అయితే ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లో లేదు అనే విషయం అందరికి తెలుసు. అందుకే అతనిపైన వరుస విమర్శలు అనేవి వస్తున్నాయి. మాజీ ఆటగాళ్లు చాలా మంది విరాట్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అతడిని జట్టు నుండి తీసేయాలని కోరుతున్నారు. ఇక ఈ క్రమంలో అభిమానులు కూడా కోహ్లీపై సీరియస్ అవుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అలాగే కోహ్లీ క్రేజ్ కూడా తగ్గిపోతుంది అని అంటున్నారు.

Advertisement

కానీ విరాట్ కోహ్లీ తాజాగా మళ్ళీ అందరికి తన క్రేజ్ అంటే ఏంటో చూపించాడు. మూడేళ్లుగా విఫలమవుతున్నా… తన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది తగ్గలేదు అని నిరూపించుకున్నాడు. అయితే తాజాగా జూన్ నెల యొక్క మోస్ట్ పాపులర్ ఇండియన్ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఎవడు అంటే జాబితాను విడుదల చేసారు. అందులో ఈ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేక… బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు కోహ్లీ. అందువల్ల ఆయన ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

Advertisement

ఈ క్రమంలో వచ్చిన ఈ లిస్ట్.. అందులో విరాట్ మొదటి స్థానంలో ఉండటం అనేది కోహ్లీ అభిమానులకు కొంత సంతోషాన్ని ఇచ్చే అంశం. ఇక ఈ మధ్యే ఇంగ్లాండ్ పర్యటలో పూర్తిగా విఫలమైన విరాట్.. వెస్టిండీస్ పర్యటన నుండి పూర్తిగా విశ్రాంతి అనేది తీస్కున్నాడు. ఇక దొరికిన ఈ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతునే.. మళ్ళీ తన ఫామ్ అలాగే టెక్నీక్ పైన కసరత్తు అనేది చేస్తున్నాడు. ఇక విండీస్ పర్యటన ముగిసిన తర్వాత టీం ఇండియా వెళ్లనున్న జింబాంబ్వే పర్యటనకు విరాట్ వెళ్లనున్నాడు. ఇక అతని ప్రదర్శనపై కోహ్లీని ఆసియా కప్ కు ఎంపిక చేయాలా.. వద్దా అనేది బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయిస్తారు.

ఇవి కూడా చదవండి :

సంజూనే మ్యాచ్ గెలిపించాడు.. రెచ్చిపోతున్న ఫ్యాన్స్..!

చైనా క్రికెట్ ఆడ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading