Home » సంజూనే మ్యాచ్ గెలిపించాడు.. రెచ్చిపోతున్న ఫ్యాన్స్..!

సంజూనే మ్యాచ్ గెలిపించాడు.. రెచ్చిపోతున్న ఫ్యాన్స్..!

by Azhar
Ad

టీం ఇండియా యొక్క యువ ఓపెనర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం అందరికి తెలుసు. అయితే సంజూ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఆడింది తక్కువ మ్యాచ్ లే. అందులో కూడా రెండు మూడు మ్యాచ్ లలో మినహా పెద్దగా రాణించలేదు. కానీ ఐపీఎల్ లో మాత్రం ప్రతి ఏడాది సంజూ అందరగొడతాడు. అందుకే అతనికి విపరీతమైన ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది. అయితే ఏ సిరీస్ కు అయిన బీసీసీఐ జట్టును ప్రకటించిన తర్వాత అందులో సంజూ పేరు లేకపోతే.. ఇక అంతే సంగతులు. ట్విట్టర్ లో అతని పేరు ట్రేండింగ్ లోకి రావడమే కాదు.. బీసీసీఐని కూడా ఒక్క రేంజ్ లో ట్రోల్ చేస్తారు.

Advertisement

అయితే ఇప్పుడు టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. అక్కడ వన్డే సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో సంజూ చేసిన అద్భుతమైన కీపింగ్ వల్లే టీం ఇండియా విజయం సాధించింది అని ట్విట్టర్ లో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో విండీస్ కు విజయ కోసం 15 పరుగులు కావాలి. సిరాజ్ వేసిన ఆ ఆఖరి ఓవర్ లో ఒక్క బౌండరీ అనేది పోతుంది. ఇక చివరి రెండు బంతులతో 8 పరుగులు కావాలి.

Advertisement

ఇక అప్పుడు 49.5వ బంతిని సిరాజ్ వైడ్ గా వేస్తాడు. ఆ బంతిని కీపర్ సంజూ అద్భుతమైన రీతిలో అపుతాడు. అందువల్ల కేవలం వైడ్ రూపంలో ఒక్క రాం మాత్రమే వస్తుంది. ఒకవేళ అది సంజూ ఆపకపోతే విండీస్ కు మొత్తం 5 పరుగులు వచ్చేవి. కానీ సంజూ అద్భుత కీపింగ్ తో మ్యాచ్ అనేది ఇండియా గెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని సంజూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో కీపింగ్ బాగా చేసిన సంజూ.. బ్యాటింగ్ లో ఆకట్టుకోలేదు. కేవలం 12 పరుగులే చేసాడు. కాబట్టి మరి రేపు జరగనున్న రెండో వన్డే యొక్క తుది జట్టులో సంజూ ఉంటాడా.. లేదా అనేది అనుమానంగా మారింది.

ఇవి కూడా చదవండి :

చైనా క్రికెట్ ఆడ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

అయ్యర్ కెప్టెన్ గా అద్భుతాలు చేయగలడు..!

Visitors Are Also Reading