Home » హరీశ్ రావు కి అధికారం కావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

హరీశ్ రావు కి అధికారం కావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Anji
Ad

హరీశ్ రావు కి అధికారం కావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనని తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.  బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక మామ, అల్లుళ్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Advertisement

Advertisement

కుట్ర పూరితంగానే పేదల ప్రభుత్వం పై కేసీఆర్, హరీశ్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. అభివృద్ధిని పక్కనబెట్టి పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడానికే కేటాయించారన్నారు. హరీశ్ రావు సీఎం కావాలంటే మరో ఔరంగ జేబు అవతారమెత్తాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఏనాడు ఉద్యోగ నియామకాలపై  దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. నియామకాలను చేపట్టకుండా విద్యార్థుల జీవితాలతో బీఆర్ఎస్ ఆడుకుందని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రక్షాళన చేసి.. కొత్త బోర్డును నియమించామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన 70 రోజుల్లోనే 25వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఒక రైతు బిడ్డ సీఎం అయితే కేసీఆర్ తట్టుకోలేకపతున్నాడని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

Also Read : ఆ సీన్ కోసం ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టిన హరికృష్ణ.. అంతటి సాహసం ఎవరు చేయరు..!

Visitors Are Also Reading