Home » యాక్సిడెంట్ చేసి షూటింగ్ కు వచ్చిన హైపర్ ఆది.. వెంటనే పోలీసులు వచ్చి..?

యాక్సిడెంట్ చేసి షూటింగ్ కు వచ్చిన హైపర్ ఆది.. వెంటనే పోలీసులు వచ్చి..?

by Azhar
Ad

శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో ప్రస్తుతం మంచి రేటింగ్స్ తో నడుస్తుంది. అయితే ఇన్ని రోజులు ఈ షో హోస్ట్ చేసిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు వెళ్లిపోవడంతో రష్మీ హోస్ట్ గా వచ్చింది. అయితే ఇప్పటివరకు సుధీర్, ఆది కలిసి ఈ షోను నిలబెట్టారు. కానీ ఇప్పుడు సుధీర్ లేకపోవడంతో ఆది ఒక్కడే ఆటో రాంప్రసాద్ సాయంతో షోను నడిపిస్తున్నాడు. ఇక ఈ షో యొక్క వచ్చే వారంకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో పోలీసులు వచ్చి హైపర్ ఆదిని అరెస్ట్ చేసారు.

Advertisement

అయితే ఈ ప్రోమో ఆది ఓ అమ్మాయితో మాట్లాడుతుండగా హైపర్ ఆది ఎక్కడ అంటూ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. షూటింగ్ జరుగుతుండగానే నేరుగా స్టేజ్ పైకి వెళ్లి ఆదిని అరెస్ట్ చేయాలనీ చెప్పారు. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురికాగా.. ఏం జరిగింది అని పోలీసులను ప్రశ్నిస్తే.. నువ్వు వచ్చేటప్పుడు యాక్సిడెంట్ చేసి వచ్చావ్. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నం అని పేర్కొంటున్నారు. అక్కడ ఉన్న వారు ఏంవారు చెప్పిన వినకుండా ఆదిని తీసుకెళ్తు కెమెరాలు ఆపండి అంటూ పోలీసులు చెప్పడం కనిపిస్తుంది.

Advertisement

అయితే ఈ విషయాన్ని అభిమానులు మాత్రం నమ్మడం లేదు. ఇది మొత్తం షో ప్రమోషన్ లో భాగమే అని అంటున్నారు. అంతేకాకుండా.. అసలు ఆదికీ డ్రైవింగ్ రాదు అని చాలా సార్లు ఆయనే చెప్పాడు. కాబట్టి డ్రైవింగ్ రాణి వ్యక్తి యాక్సిడెంట్ ఎలా చేసాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఆ పోలీసులుగా వచ్చినవారు బాగానే యాక్ట్ చేసారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆది నిజంగానే యాక్సిడెంట్ చేశాడా.. లేదా ఇదంతా కేవలం ప్రమోషన్స్ లో భాగమేనా అని తెలియాలంటే ఈ వచ్చే ఆది వారం వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ఆటగాళ్ల పై ఉమ్రాన్ మాలిక్ షాకింగ్ కామెంట్స్… పొరపాటున కూడా..!

సిరాజ్ వల్లనే గొడవ అంటున్న రియాన్ పరాగ్…!

Visitors Are Also Reading