Home » మ్యాట్రిమొనీలో ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు.. భార్య గురించి తెలిసి ఆశ్చర్యపోయాడు..!

మ్యాట్రిమొనీలో ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు.. భార్య గురించి తెలిసి ఆశ్చర్యపోయాడు..!

by Anji
Ad

సాధారణంగా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల కోసం పెళ్లి కూతురు లేదా పెళ్లి కుమారుడు దొరక్క మాట్రిమోని సైట్ల మీద ఆధారపడుతున్నారు. పూర్వ కాలంలో అయితే బంధువులు లేదా తెలిసిన వారు పెళ్లి సంబంధాలు చూసేవారు.  సమాజం రోజు రోజుకు మారిపోయింది. ముఖ్యంగా తమకు నచ్చిన వారిని ఆయా మాట్రిమొని సైట్ల ద్వారా ఏరికోరి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. మాట్రిమోని సైట్ల ద్వారా అయ్యే పెళ్లిళ్లలో కొన్ని మాత్రమే జెన్యూన్ గా ఉంటున్నాయి. చాలా వరకు ఫేక్ అకౌంట్లే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. తప్పుడు సమాచారం అందించి పెళ్లిళ్లు చేసుకునే వారు చాలా ఎక్కువ అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి మ్యాట్రిమోని సైట్ ద్వారా పెళ్లి చేసుకొని ఆశ్చర్యానికి గురయ్యాడు. తాను పెళ్లి చేసుకొని కంగుతిన్నాడు. ఈ సంఘటన గుజరాత్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.

Advertisement

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ కి చెందిన విమల్ కరియాకు మాట్రిమోనీ సైట్ ద్వారా రీతాదాస్ అనే మహిళ పరిచయమైంది. ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటుండేవారు. తనకు ఇదివరకు పెళ్లి అయిందని.. భర్తతో విడాకులు తీసుకున్నానని.. పేపర్లు తీసుకురమ్మని విమల్ కోరాడు. తనకు గ్రామపంచాయతీలో పెళ్లి జరిగిందని చెప్పు తప్పించుకుంది. ఈ విషయాన్ని విమల్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ అస్సాం నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు వెళ్లి వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి అక్కడే ఉండేవారు. పెళ్లి జరిగిన ఆరు నెలల తరువాత రీతా అస్సాంకు బయలుదేరింది. స్థలం గొడవ కారణంగా అస్సాం వెళ్తున్నట్టు విమల్ కి చెప్పింది. ఆమె వెళ్లిన తరువాత విమల్ కి ఓ ఫోన్ వచ్చింది. తాను రీతా లాయర్ ని అని.. రీతా ఓ కేసులో ఇరుక్కుందని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఆమెను విడిపించాలంటే లక్ష రూపాయలు అవసరం అయితాయని అడగ్గానే వెంటనే చెల్లించాడు. రీతా కోర్టు పేపర్లను చదివిన అతనికి వెంటనే అనుమానం కలిగింది.

Advertisement

ఆ కోర్టు పేపర్లలో రీతా చౌహన్ అని ఉంది. దీంతో అతని పేరు మీద ఉన్నతికమకను నివృతం చేసుకోవాలనుకున్నాడు. భార్యకు ఫోన్ చేసి ఈ విషయాన్ని అడిగాడు. ఆమె దానిని దాటవేసే ప్రయత్నం చేసింది. పదే పదే ఈ విషయం గురించి ప్రస్తావించడంతో అతని ఫోన్ ఎత్తడమే మానేసింది. ఇక తరువాత అతని నెంబర్ ని బ్లాక్ చేసింది. దీంతో విమల్ కి భార్యపై అనుమానం మరింతగా పెరిగిపోయింది. గూగుల్ లో ఆమె పేరు సెర్చ్ చేసాడు. రీతా గురించి గూగుల్ వచ్చిన సమాచారం చూసి షాక్ కి గురయ్యాడు. తన భార్య మోసం, దొంగతనం వంటి నేరాల్లో నిందితురాలని కంగుతిన్నాడు. ఆమెకు ఇది వరకే అనిల్ చౌహన్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిందని.. ఇద్దరూ కలిసి దాదాపు 6వేల కార్లను దొంగతనం చేశారని వెల్లడి అయింది. తనకు అనిల్ చౌహన్ కి ఎలాంటి సంబంధం లేదని రీతా చెప్పడం గమనార్హం. విమల్ మాత్రం తాను మోసపోయినట్టు తెలిసి చాలా బాధపడుతున్నాడు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

 పవన్‌ కళ్యాణ్‌, సన్నీలియోన్‌ ఇద్దరూ ఒక్కటే..ఐస్‌ క్రీమ్‌ పెట్టుకో !

జగన్‌ బిగ్‌ స్కెచ్‌..పవన్ కళ్యాణ్‌ పై పోటీకి వాలంటీర్…!

Visitors Are Also Reading