Home » శివాజీ సినిమాలో దర్శకుడు శంకర్ విలన్ గా సుమన్ నే ఎందుకు తీసుకున్నారో తెలుసా ? 

శివాజీ సినిమాలో దర్శకుడు శంకర్ విలన్ గా సుమన్ నే ఎందుకు తీసుకున్నారో తెలుసా ? 

by Anji
Published: Last Updated on
Ad

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన శివాజీ సినిమా గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా తమిళ, తెలుగు రెండు భాషల్లో  భారీ వసూళ్లనే రాబట్టింది. రజినీకాంత్ నట విశ్వరూపాన్ని చూపించిన చిత్రం శివాజీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా శివాజీ చిత్రంలో విలన్ గా ఒకప్పటి స్టార్ హీరో అయినటువంటి సుమన్ చేశారు. 

Advertisement

 

అసలు సుమన్ అంటే అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది.  ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు కూడా అలాంటివే. దర్శకుడు శంకర్ తన సినిమాకి విలన్ కావాలి అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటారు అని చాలామంది పేర్లు పరిశీలించి చివరగా సుమన్ ని తీసుకున్నారు. సుమన్ అయితే అప్పటివరకు ఎప్పుడు కూడా విలన్ గా చేయలేదు. అందుకే సుమన్ ని విలన్ గా పెడితే ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది అని భావించి ఆయనను తీసుకున్నారట. ఈ సినిమాలో విలన్ గా సుమన్ నటన అద్భుతమనే చెప్పాలి.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కడంతో ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. 

Advertisement

Also Read :  మేధావిలా న‌టిస్తాడంటూ బండ్ల‌గ‌ణేష్ ట్వీట్…ఆ ద‌ర్శ‌కుడినేనా..?

Manam News

సుమన్ అయితేనే ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోతాడని  నమ్మిన శంకర్ నమ్మకాన్ని సుమన్ 100% నిలబెట్టారనే చెప్పాలి. ఈ విషయాన్ని శంకర్ చాలా సార్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. సుమన్ కూడా విలన్ గా అసలు ఎవరు ఊహించని విధంగా తన నటనతో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తో  ఓ  సినిమా చేస్తున్నాడు శంకర్. దీంతో పాటు కమల్ హాసన్ తో ఇండియన్ 2 కూాడా చేస్తున్నాడు. ఇక  ఈసారి శంకర్ భారీ హిట్  కొట్టడమే లక్ష్యంగా ఈ రెండు సినిమాలను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సుమన్ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. 

Also Read :   సినీ హీరో సుమన్ గురించి మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే..? 

Visitors Are Also Reading