Home » భర్త వద్దకు వెళ్లడం లేదని కూతురిని తండ్రి ఏం చేశాడంటే..?

భర్త వద్దకు వెళ్లడం లేదని కూతురిని తండ్రి ఏం చేశాడంటే..?

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి అయిన కూతురిని గొంతు నులిమి చంపి, తల, మొండెం వేర్వేరు చేశారు. ఆమె వల్ల కుటుంబం పరువు పోతుందనే కోపంతో కన్నతండ్రి పుట్టింటికి వచ్చిన కూతురిని తిరిగిరాని లోకాలకు పంపించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవేందర్ రెడ్డి అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Advertisement

పెద్ద కుమార్తె పేరు ప్రసన్న (21)కి రెండేళ్ల కిందట ఆమెకు ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్లి జరిగింది. వీరు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. ఇటీవల భర్త వద్ద నుంచి పుట్టింటికి వచ్చిన ప్రసన్న తిరిగి హైదరాబాద్ కి వెళ్లడానికి ఇష్టపడలేదు. పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తితో గ్రామంల సాన్నిహిత్యంగా ఉండడం.. భర్త వద్దకు వెళ్లకపోవడాన్ని గమనించిన తండ్రికి ఇది నచ్చలేదు. దీంతో తన పరువు పోతుందని.. కోపంతో ఫిబ్రవరి 10, 2023న ఆమె తండ్రి దేవేందర్ రెడ్డి ప్రసన్నను ఇంట్లోనే గొంతు నులిము Haత్య చేశాడు. ఇక ఆ తరువాత కొంత మంది సహాయంతో కూతురు శవాన్ని నంద్యాల-గిద్దలూరు మార్గంలోని అటవీ ప్రాంతానికి కారులో తీసుకెళ్లారు. అక్కడ తల, మొండం వేరు చేశారు. రెండు వేర్వేరు చోట్ల పడేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తరువాత ఏమి తెలియనట్టు నటించారు.  

Advertisement

Also Read :  Hyderabad Metro Jobs : హైదరాబాద్ మెట్రోలో ఖాళీలకు నోటిఫికేషన్…అర్హతలు ఇవే…

ఈ నేపథ్యంలో రోజు క్రమం తప్పకుండా ఫోన్ చేసే మనవరాలు ప్రసన్న ఈ మధ్య ఫోన్ చేయడం లేదు ఏమిటని తాత శివారెడ్డి ఆరా తీశాడు. కొడుకు దేవేందర్ రెడ్డిని అడిగితే తనకు తెలియదు అని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన శివారెడ్డి గట్టిగా నిలదీయడంతో.. కుమార్తె చేసే పనుల వల్ల తన పరువు పోతుందని.. తలెత్తుకోకుండా చేస్తుందనే కోపంతోనే చంపేసినట్టు అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. వెంటనే శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. దేవేందర్ రెడ్డిని తీసుకెళ్లి ఆ ప్రాంతాలలో గాలించారు. తల, మొండెం మాత్రం ఎక్కడ దొరకలేదు. తరువాత రోజు ప్రసన్న శరీర భాగాలు కొన్ని లభించాయి. వీటిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.  

Also Read :  తారకత్న భార్య అలేఖ్య రెడ్డికి చంద్రబాబు కీలక పదవి?

Visitors Are Also Reading