అలనాటి నటి సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అందం, అభినయం, నటన అన్నింటిలో ప్రతిభ కనబరిచేది. దేశవ్యాప్తంగా ఆమె గుర్తింపు పొందిన నటి అనే చెప్పవచ్చు. వెండి తెరపై ఆమె చెరగని ముద్ర వేసి చిన్న వయసులోనే కనుమరుగు అయిపోయింది నటి సౌందర్యను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. జూలై 18, 1972 న బెంగుళూరులో జన్మించిన సౌందర్య తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది.
Also Read : ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న చిన్మయి.. సోషల్ మీడియాలో వైరల్
Advertisement
దాదాపు 12 సంవత్సరాల పాటు అగ్రనటిగా ఓ వెలుగు వెలుగు వెలిగింది. ఈమె ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కోసం బెంగుళూరు నుంచి బయలు దేరింది. ఆమె ఎక్కిన విమానం ప్రమాదానికి గురై కనుమరుగైపోయింది. ఆ సంఘటన జరిగి 18 ఏళ్లు అవుతున్నా ప్రేక్షకులు మాత్రం ఇంకా మరిచిపోలేదు. ఇదిలా ఉండగా తాజాగా.. టాలీవుడ్ లో సౌందర్య కు అత్యంత సన్నిహితురాలు అయిన హీరోయిన్ ఆమని ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement
Also Read : మాలీవుడ్ స్టార్ హీరోతో జ్యోతిక లవ్స్టోరి..!
సౌందర్య చనిపోయిందని తెలిసి తన గుండె ముక్కలైందని.. ఆమె స్థానంలో తాను చనిపోయిన బాగుండేదని అనుకున్నట్లు ఆమని తెలిపింది.” ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది సౌందర్య మాత్రమే. సౌందర్య చనిపోయిందని తెలిసి నా గుండె ముక్కలైంది. ఆమె స్థానంలో నేను చనిపోయిన బాగుండేది. ఎందుకంటే నాకు పిల్లలు లేరు. లైఫ్ మొత్తం చూశాను. ఇక చనిపోయే సమయానికి సౌందర్యకు పెళ్లయి ఏడాదే అయింది. ఆ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు కూడా రాశారు. కానీ అందులో వాస్తవం లేదు. స్వయంగా సౌందర్య తల్లి నాకు చెప్పింది”. అంటూ భావోద్వేగానికి గురైంది ఆమని.
Also Read : ఆ ఒక్క కారణం వల్ల వేటగాడు లో ఎన్టీఆర్ పక్కన నటించనని చెప్పిన శ్రీదేవి…..! దాంతో ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా..?