కేవలం కన్ను గీటి కుర్రకారును అంతా ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకున్న హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు జనాలకు అలవాటు అవుతున్న సమయంలో కేవలం 30 సెకన్లు కన్ను గీటిన వీడియో క్లిప్ తో ఓవర్ నైట్ పాపులర్ అయిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో మూవీలో నటిస్తోంది. ఈ మూవీ జులై 28న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. బ్రో మూవీ గురించి ప్రియా వారియర్ తన అనుభవాలను బయటపెట్టింది.
Advertisement
లవర్స్ డే మూవీతో మంచి నటిగా గుర్తింపు పొందిన ప్రియా వారియర్ సోషల్ మీడియా పుణ్యమా అని తక్కువ సమయంలోనే తెగ పాపులర్ అయింది. ఈ మూవీ చేసే నాటికి ప్రియా వయస్సు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. తెలిసి, తెలియని వయస్సులో ఈ బ్యూటికి వచ్చిన పాపులారిటీ ఈమె కెరీర్ ని చిక్కుల్లో పడేసింది. ఇప్పుడిప్పుడే మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియా వారియర్ తాజాగా పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశం అందుకుంది. ఈ విషయం పై ఆమె స్పందిస్తూ.. “కెరీర్ ప్రారంభంలో పవన్ కల్యాణ్ లాంటి గొప్ప నటుడితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
Advertisement
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి, నాకు మధ్య కొన్ని సన్నివేశాలుంటాయి. తన యాక్టింగ్ తో పవన్ మ్యాజిక్ చేస్తారు. గత సినిమాలో పోల్చితే నేను ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాను. ఇందులో నా క్యారెక్టర్ పేరు వీణ. తప్పకుండా ఈ సినిమా నా కెరీర్ లో గుర్తుండిపోతుంది. హోమ్లీ గర్ల్ లాంటి పాత్ర వినోదయ సీతాంతో పోల్చితే బ్రో మూవీలో చాలా మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమాలో సోల్ మిస్ అవ్వకుండా చేంజేస్ చేశారు. చాలా కొత్త సీన్లు ఈ సినిమాలో ఉంటాయి. ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ నచ్చుతుంది” అని చెప్పుకొచ్చింది ప్రియా ప్రకాశ్ వారియర్.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
బేబీ మూవీ గురించి సుకుమార్ ఏమన్నారో తెలుసా ?
వామ్మో.. 513 అంతర్జాతీయ అవార్డులు.. ‘బేబీ’ సెకండ్ హీరో విరాజ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?