Home » రజినీకాంత్ వైసీపీ నేతలను టార్గెట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ?

రజినీకాంత్ వైసీపీ నేతలను టార్గెట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకు ఉన్న క్రేజ్ మామూలు కాదు. ముఖ్యంగా రాజకీయాలకు దూరంగానే ఉంటారు రజినీకాంత్. అసలు రాజకీయాలకు,రజినీకి సంబంధిం ఏంటి..? రాజకీయాలకు దూరంగా ఉండే రజినీ రాజకీయాల్లో ఎందుకు వేలు పెడుతున్నారు. అది కూడా వైసీపీ నేతలను రజినీ ఎందుకు టార్గెట్ చేసినట్టు అనుకుంటున్నారా ? దానికి ఓ కారణం ఉంది. రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఆగస్టు 10న విడుదల కాబోతుంది. ఇందుకోసం  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

Advertisement

జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దాదాపు రజినీకాంత్ గంట సేపు మాట్లాడారు. ఎక్కువగా రాజకీయాల గురించే మాట్లాడారు. వైసీపీ నేతలనే టార్గెట్ చేస్తూ.. ఆయన వ్యాఖ్యలు చేశారని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ కొనసాగుతుంది. అర్థమైందా రాజా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల గురించే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండు జరగని ఊరు లేదు.. అవన్నీ మనం పట్టించుకుంటామా..? అయినా మనం పట్టించుకోవద్దు. 

Advertisement

వీటిని అస్సలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా అంటూ జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజినీ చెప్పుకొచ్చారు. రజినీకాంత్ కి వైసీపీకి మధ్య ఎక్కడ బెడిసికొట్టిందంట.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సమయంలో రజినీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్, చంద్రబాబును పొగిడుతూ మాట్లాడాడు. ఇది గిట్టని వైసీపీ నేతలు రజినీకాంత్ ని టార్గెట్ చేశారు. రోజా, కొడాలి నాని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అందుకే వారికి ఇన్ డైరెక్ట్ గా కౌంటరిచ్చారు సూపర్ స్టార్ రజినీకాంత్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Suryakantham and chayadevi : సూర్యకాంతం – ఛాయాదేవి మధ్య ఉన్న ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా..?

రంగస్థలం మూవీలో రామ్ చరణ్ చెల్లెలుగా నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకి అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన తొలి హీరో ఇయనే..! 

Visitors Are Also Reading