Home » పొన్నియిన్ సెల్వ‌న్ లో త్రిష ధ‌రించిన న‌గ‌ల చ‌రిత్ర గురించి మీకు తెలుసా ?

పొన్నియిన్ సెల్వ‌న్ లో త్రిష ధ‌రించిన న‌గ‌ల చ‌రిత్ర గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

హీరోయిన్ త్రిష గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. ఈమె ప్ర‌స్తుతం పొన్నియిన్ సెల్వ‌న్ సినిమా ప్ర‌మోష‌న్‌ల‌లో ఫుల్ బిజీగా ఉంది. ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో ఐశ్వ‌ర్య‌రాయ్, త్రిష‌, విక్ర‌మ్‌, కార్తి, జ‌యం ర‌వి, శోభితా ధూళిపాళ్ల న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం చోళ రాజ‌వంశాన్ని వెండి తెర‌పై చూపించ‌బోతున్నారు.

Advertisement

దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో నిర్వ‌హిస్తున్న ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. ఈ చిత్రంలో తాను ధ‌రించిన న‌గ‌ల‌న్నీ నిజమైన‌వే అని చెప్పారు త్రిష‌. తాను ఈ సినిమాలో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలిపింది. ఈ చిత్రంలో త్రిష చోళ దేశ‌పు రాజ‌కుమారి కుంద‌వై పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో త్రిష ధ‌రించిన న‌గ‌ల‌న్ని నిజ‌మైన‌వే అని చెప్పారు.

Advertisement

Also Read :  కార్తీకేయ-2 ఓటీటీలో విడుద‌ల ఎప్పుడంటే..?

పొన్నియిన్ సెల్వ‌న్ సినిమాలో నా పాత్ర చాలా స‌హంజ‌గా ఉంటుంది. ఇందులో నేను చోళ రాకుమారిగా క‌నిపిస్తాను. తాను పోషిస్తున్న కుంద‌వై పాత్ర ప‌ట్ల చాలా శ్ర‌ద్ధ తీసుకున్నాం. ఆనాటి రాజుల ఆహార్యం త‌ల‌పించేలా దుస్తులు, న‌గ‌ల‌ను ఎంపిక చేశారు. కొన్ని స‌న్నివేశాల్లో నేను నిజ‌మైన న‌గ‌లే ధ‌రించాను. మాకు స‌హ‌కార‌మందించిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మ‌ణిర‌త్నం సినిమాలో భాగం కావ‌డం చాలా సంతోషంగా ఉంది. నా పాత్ర‌కు పూర్తిగా న్యాయం చేశాను అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు త్రిష‌. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం సెప్టెంబ‌ర్ 30న ఆడియ‌న్స్ ముందుకు రానున్న‌ది.

Also Read :  మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమాకి టైటిల్ ఖరారు..!

 

Visitors Are Also Reading