Home » సీమంతం వేడుకలో ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..?

సీమంతం వేడుకలో ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..?

by Anji
Ad

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో ఆసుపత్రిల అధినేత మనవరాలిగా ఉపాసనకు ప్రత్యేకమైన గుర్తింపుంది. సామాజిక స్పృహ ఉన్న మహిళగా, వ్యాపారవేత్తగా తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా ఉపాసన గర్భవతి కావడంతో మెగా వారింట్లో  సంబురాలు మిన్నంటాయి. గర్భవతిగా ఉండి కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న ఆమె.. ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుతూ.. నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రెగ్నెన్సీ ఈవెంట్స్ తాలూకు ఫొటోలు మెగా అభిమానులతో షేర్ చేసుకుంటోంది.  

Also Read :   త్రిష పెళ్లిని ఆపేసిన స్టార్ హీరో…?

Advertisement

మరికొద్ది నెలల్లో ఉపాసన ప్రసవం కానున్న నేపథ్యంలో మెగా ఇంట్లో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఉపాసన సీమంతంకి సంబంధిన వేడుకను ఘనంగా నిర్వహించారు. అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ సమక్షంలో ఈ ఫంక్షన్ జరిగింది. ఉపాసన బేబీ షవర్ పార్టీకి ప్రముఖ సింగర్ కనికా కపూర్, సానియా మీర్జా, నటుడు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇక ఇదే పార్టీలో చిరంజీవి ఫ్యామిలీ కూడా పాల్గొంది. చిరంజీవి కూతుళ్లు, మనవరాళ్లు హాజరయ్యారు. ఈ బేబీ షవర్ పార్టీలో పింక్ కలర్  డ్రెస్ ధరించింది ఉపాసన. ఇది చూడటానికి ఈ డ్రెస్ ఎంతో గ్రాండ్ గా ఉండటంతో అందరూ ఈ డ్రెస్ తాలూకు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Advertisement

Also Read :  బిచ్చ‌గాడు సినిమాను చేతులారా వ‌దులుకున్న‌ టాలీవుడ్ స్టార్ ఎవ‌రో తెలుసా..? ఎందుకు వ‌దులుకున్నారంటే..?

తాజా సమాచారం మేరకు ఈ డ్రెస్ నీడిల్ థ్రెడ్ బ్రాండ్ కి చెందినదని.. దీని ధర సుమారుగా ఒక లక్ష రూపాయలు అని తెలిసింది. ఉపాసన డెలివరీ సమయంలో చరణ్ పక్కనే ఉండాలని షూటింగ్ లకు మూడు నెలలు గ్యాప్ ఇచ్చాడట. ఈ విషయం బయటకు రావడంతో చెర్రీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి జూన్ 14, 2012న హైదరాబాద్‌లో ఘనంగా వైభవంగా జరిగింది.   ఈ దంపతులకు పిల్లలు కలుగడం లేదని ఇన్ని రోజులు రకరకాలు పేర్కొన్నారు. తాజాగా ఉపాసన-రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతుండటంతో అలా అన్న వారందరి నోళ్లు మూయించినట్టయిందని చెప్పవచ్చు. 

Also Read :  దేవసేన పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Visitors Are Also Reading