Home » చిన్మయి డబ్బింగ్ కు ఒప్పుకొని సమంత..!

చిన్మయి డబ్బింగ్ కు ఒప్పుకొని సమంత..!

by Azhar
Ad

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత.. ప్రస్తుతం శకుంతల మరియు యశోద అనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సమంత తెలుగులోకి ఏం మాయ చేసావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలుసు. కానీ అప్పటికి సమంతకు తెలుగు అనేది రాదు. అందుకే తెలుగు రాణి మిగితా హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పించిన విధంగానే సమంతకు కూడా సింగర్ చిన్మయితో డబ్బింగ్ చెప్పించారు.

Advertisement

ఇక సమంతకు చిన్మయి డబ్బింగ్ అనేది బాగా సూట్ కావడంతో.. ప్రతి సినిమాలో కూడా ఆమెతోనే డబ్బింగ్ చేపిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సమంత, చిన్మయి ఇద్దరు మంచి సేన్హితులు కూడా అయ్యారు. కానీ మహానటి సినిమా నుండి సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పడం లేదు. అప్పటి నుండి తనకు తానే వాయిస్ అనేది ఇస్తుంది సమంత. కానీ సమంత వాయిస్ కు మంచి మార్కులు అనేవి రాలేదు.

Advertisement

అందుకే ప్రస్తుతం చేస్తున్న శాకుంతలం సినిమాలో చిన్మయితో డబ్బింగ్ చెప్పించాలని దర్శకుడు గుణశేఖర్ అనుకుంటున్నాడట.. కానీ సమంత మాత్రం చిన్మయితో డబ్బింగ్ చెప్పించడానికి ఒప్పుకోవడం లేదు అని తెలుస్తుంది. అయితే ఈ మధ్య చిన్మయికి అలాగే సమంతకు మధ్య విబేధాలు అనేవి వచ్చాయి అని తెలుస్తుంది. ఆ కారణంగా వీరు చాలా రోజులుగా కలసుకోలేదట. అందుకే ఇప్పుడు చిన్మయితో డబ్బింగ్ అనేసరికి సమంత ఒప్పుకోవడం లేదు అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

మహిళల ఐపీఎల్ పై క్లారిటీ.. మొత్తం 5 జట్లు..!

ఇండియా పరువు తీసిన కెఎల్ రాహుల్..!

Visitors Are Also Reading