Home » నా భార్య పిల్లలతో అయోధ్యకు వెళ్తా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నా భార్య పిల్లలతో అయోధ్యకు వెళ్తా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anji
Ad

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రామ్ లల్లాను చూసేందుకు వెళ్లనున్నట్లు ఆయనే స్వయంగా తెలిపారు. శ్రీరాముడిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళ్తానని  కేజ్రీవాల్  చెప్పారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత.. ఢిల్లీ నుంచి అయోధ్యకు మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రామ్ లల్లా పట్టాభిషేక కార్యక్రమానికి ఆహ్వానం గురించి అడిగిన ప్రశ్నకు, కేజ్రీవాల్ ఈ విధంగా వివరణ ఇచ్చారు.

Advertisement

తనకు రామమందిర ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఎలాంటి ఆహ్వాన పత్రిక అందలేదని.. ఈ వేడుకకు చాలా మంది వీఐపీలు వస్తారని.. అందుకే భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకరిని మాత్రమే అనుమతిస్తారని ట్రస్టు లేఖలో పేర్కొంది. జనవరి 22న తర్వాత.. నేను, మా తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో దర్శనానికి వెళ్తాను అని కేజ్రీవాల్ చెప్పారు. దేశవ్యాప్తంగా రామ్‌లల్లా పవిత్రోత్సవం కోసం సన్నాహాలు రామ భక్తితో నిండిన వాతావరణం మధ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నెలలో రెండో మంగళవారం సుందర్‌కాండ్ పాత్‌ను నిర్వహించనుంది. దీనికి సంబంధించి,  జనవరి 16న, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రోహిణిలోని హనుమాన్ ఆలయంలో సుందర్‌కండ్ పాథ్‌లో పాల్గొన్నారు.

Advertisement

ఈ సమయంలో ఆయనతో పాటు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా ఉన్నారు. అంతకుముందు కేజ్రీవాల్ క్యాబినెట్ లోని మంత్రి సౌరభ్ భరద్వాజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ మోదీతోపాటు 22నేరాముడి గుడికి ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. 23,24 తేదీల్లో ఎందుకు వెళ్లకూడదు. రాముడు ఎప్పుడైనా అక్కడే ఉంటాడు. మీకు భక్తి ఉంటే మీ ఆఫీసుల్లో ఉండి రాముడిని పూజించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మోడీతో వెళ్లాలి..మోదీతో కూర్చోవాలనేమీ లేదు కదా అన్నారు.

మరిన్ని  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి!

Visitors Are Also Reading