Home » జగన్‌ ప్రభుత్వం సంచలనం – చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ ..!

జగన్‌ ప్రభుత్వం సంచలనం – చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ ..!

by Bunty
Ad

చంద్రబాబు ప్రభుత్వానికి జగన్‌ ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కరకట్టపై చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ అటాచ్‌ చేసింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు క్రిమినల్‌ లా అమెండమెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేశారు అధికారులు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడో ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో ఈ చర్యలకు దిగింది జగన్‌ సర్కార్‌.

Advertisement

సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్‌ పొందారని అభియోగం తెరపైకి వచ్చింది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలుతుంది. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని కూడా అభియోగం ఉంది.

Advertisement

అలాగే, వ్యాపారి లింగమనేని అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో క్రిమినల్‌ లా అమెండ మెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది ఏపీ సీఐడీ. దీంతో చట్టం ప్రకారం అటాచ్‌ చేసిందది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఇక స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్‌ హౌస్‌ అటాచ్ చేసింది జగన్ ప్రభుత్వం.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

‘కస్టడీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్… స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

  ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… లక్ష జీతం

Suryakumar Yadav : సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్… వీడియో వైరల్

Visitors Are Also Reading