Home » “ఛత్రపతి” సూరీడు గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడు..ఏం చేస్తున్నాడో తెలుసా…!

“ఛత్రపతి” సూరీడు గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడు..ఏం చేస్తున్నాడో తెలుసా…!

by AJAY
Ad

ప్రభాస్ కెరీర్ లోని సూపర్ హిట్ సినిమాల్లో ఛత్రపతి సినిమా ఒకటి. ఈ సినిమా తో ప్రభాస్ మాస్ ఇమేజ్ ఒక రేంజ్ కు వెళ్ళిపోయింది. అంతే కాకుండా ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శ్రీయ నటించింది. విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా జక్కన్న ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

Advertisement

ఈ సినిమాలోని కొన్ని సీన్లు రోమాలు నిక్కబొడుచుకునెలా ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో కాట్ రాజ్ వచ్చి సురీడుని కొట్టే సీన్ కు గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ సీన్ తోనే కథ మొత్తం మలుపు తిరుగుతుంది. ప్రభాస్ విలన్లను ఢీ కొడతాడు. ఇలాంటి సీన్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సూరీడు పాత్రలో నటించిన భశ్వంత్ వంశీ సూపర్ గా నటించాడు.

Advertisement

అమాయకమైన కుర్రాడిగా కనిపిస్తూ కన్నీళ్లు పెట్టించాడు. తన తల్లికి కళ్ళు కనిపించక సూరీడు సూరీడు అంటూ పిలుస్తుంటే సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు వచ్చాయి. ఇదిలా ఉంటే సూరీడు పాత్ర చేసిన భశ్వంత్ ఆ తరవాత చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.

ఇక ప్రస్తుతం భశ్వంత్ వంశీ పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఛత్రపతి సినిమా వచ్చే దాదాపు 18 ఏళ్లు అవుతోంది. ఇక ఇప్పుడు భశ్వంత్ వంశీ విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. మరి అప్పటి సూరీడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదంటే సైడ్ పాత్రలు చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

 

Also read :

భ‌య‌మేస్తుంది నాన్న‌ నేను బ‌తుక‌లేను.. వెలుగులోకి విస్మ‌య ఆడియో క్లిప్‌..!

బాల‌కృష్ణ‌ కూతురుగా న‌టించ‌నున్న ఆ యంగ్ హీరోయిన్‌..!

Visitors Are Also Reading