Home » విమానాల్లో ప్రయాణించేటప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటారు.. ఎందుకో తెలుసా ?

విమానాల్లో ప్రయాణించేటప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటారు.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా కొన్ని నిషేదిత వస్తువులను వెంట తీసుకురావద్దని.. సదరు సంస్థలు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. చాలా మందికి అంతు చిక్కని విషయం ఏంటంటే.. విమానాలలో ప్రయాణించేటప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని పదే పదే ప్రకటిస్తుంటారు. దీంతో పాటు ఎయిర్ హోస్టెస్ కూడా మీకు చెబుతుంటారు. ముఖ్యంగా విమానం గాలిలోకి ఎగురుతున్నప్పుడు నేలపైకి దిగుతున్నప్పుడు మీ ఫోన్ కచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయాలని లేదా ఎయిర్ ప్లేన్ మోడ్ లో పెట్టాలని చెబుతుంటారు. అలా ఎందుకు చెబుతారో చాలా మందికి తెలియదు. దీని ఉన్నటువంటి సైంటిఫిక్ కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

విమానంలో చాలా మంది సెల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాలలో మీ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయాలని అంటుంటారు.  ముఖ్యంగా విమానాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకాన్ని అధికారికంగా నిషేదించలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కానీ అటెండెట్స్ మాత్రం మీ మొబైల్ ఫోన్ స్విచ్ చేయాలని సూచిస్తుంటారు. భద్రత కారణాలను దృష్టిలో పెట్టుకొని వారు ఇలాంటి అనౌన్స్ మెంట్స్ ని చేస్తుంటారు. సెల్ ఫోన్స్, పలు ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలే మొబైల్ స్విచాఫ్ చేయాలని చెప్పడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా మొబైల్ ఫోన్ లో, ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలు, విమానంలోని నావిగేషన్ ఉపయోగించే రేడియో తరంగాలు దాదాపు ఒకే ప్రీక్వెన్సీ ఉంటాయి. దీంతో కాక్ పిట్ లో ఉండే ఏరోనాటికల్ వ్యవస్థకి ఇది అంతరాయం కలిగించవచ్చు. 

Advertisement

Also Read :  పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. కొత్త మోడల్ పేపర్లు వచ్చేశాయ్ !

Manam News

ఇది ప్రమాదానికి దారి తీసే అవకాశాలను సృష్టిస్తుంది. విమానం ఎత్తుకు పోయే కొద్ది సెల్ ఫోన్లు ఎక్కువ మొత్తంలో సిగ్నల్స్ పంపుతాయి. దీంతో సిగ్నల్స్ ట్రాఫిక్ ఏర్పడుతుంది. విమానంలో వినియోగించే టెక్నికల్ వ్యవస్థకి ఇది అంతరాయం కలిగించవచ్చు. విమానం టేకాప్, ల్యాండింగ్ సమయాలలో మీ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని చెబుతుంటారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా ఇప్పటివరకు ప్రమాదాలు జరిగిన సంఘటనలు చరిత్రలో లేవు. ప్రధానంగా విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియ చాలా కీలకమైంది. ముందు జాగ్రత్తగా ఇలా ఫోన్ లను ఆఫ్ చేయాలని చెబుతుంటారు. ప్రస్తుతం చాలా విమాన యాన సంస్థలు తమ విమానాలలో వైఫై సేవలను ప్రారంభించాయి. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ సిబ్బంది చెప్పినట్టుగా మీ ఫోన్ ను ఆఫ్ చేయడం బెటర్. 

Also Read :  వారసుడు సినిమాలో 10 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఆ సీన్ లేపేశారా..?

Visitors Are Also Reading