జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటారు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. అయితే తాజాగా మరో వివాదానికి శ్రీకారం చుట్టారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.
READ ALSO : గరుడ పురాణం చుట్టూ తిరిగే “ఊరు పేరు భైరవ కోన”… అదిరిపోయిన టీజర్
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై తన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ముత్తిరెడ్డిపై సొంత కూతురు తుల్జా భవాని రెడ్డి కంప్లైంట్ చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమి విషయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తుల్జా భవాని రెడ్డి ఆరోపణలు చేశారు. ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీద తీసుకున్నారని కూతురు తుల్జా భవానిరెడ్డి తన తండ్రిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
READ ALSO : Keerthy Suresh : కీర్తి సురేష్ కు ఏమైంది…? ముఖంపై గాయాలతో మహానటి…!
అయితే గతంలో ఈ భూమిపై తీవ్ర వివాదం చెలరేగింది. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు, ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఆయన సొంత కూతురే ఫిర్యాదు చేయడంతో ఆ భూ వివాదం ఎప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ముత్తిరెడ్డిపై సొంత కూతురే ఇలా ఫిర్యాదు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
READ ALSO : ఆ దర్శకుడితో లవ్ లో పడిపోయిన సింగర్ సునీత… మరి రామ్ పరిస్థితి?