Home » పరారీలో బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. తల్లిదండ్రులు ఏమన్నారంటే ?

పరారీలో బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. తల్లిదండ్రులు ఏమన్నారంటే ?

by Anji

రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లోకి వెళ్లి సెన్సేషన్ అయ్యాడు పల్లవి ప్రశాంత్‌. బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచి బయటికి వచ్చిన వెంటనే కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటకు వస్తుండగా.. ర్యాలీ తీసిన సమయంలో  గొడవ జరిగింది. అది ఇప్పుడు కేసుల వరకూ వెళ్లింది. ప్రస్తుతం బిగ్‌బాస్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అజ్ఞాతంలోనే ఉన్నారు. కేసులు నమోదుకాగానే కనిపించకుండాపోయాడు పల్లవి ప్రశాంత్‌. జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు వచ్చి కేసు వివరాలు సేకరించనున్నారు ప్రశాంత్‌ లాయర్‌. జూబ్లీహిల్స్‌ పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రశాంత్ లాయర్ రాజ్‌కుమార్‌ సిద్దమయ్యారు. కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెప్పుకుంటున్న కొందరు చేసిన న్యూసెన్స్ ఇప్పుడు ప్రశాంత్ కి చిక్కులు తెచ్చిపెట్టింది. బిగ్‌బాస్‌ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను పోలీసుల సహకారంతో వేరే మార్గం నుంచి బయటికి పంపించింది. అయితే పల్లవి ప్రశాంత్‌ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్‌బాస్‌ యాజమాన్యం సూచనలను బేఖాతర్‌ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్‌ టాప్‌ జీప్‌పై చేరుకోవడంతో రచ్చ స్టార్ట్ అయ్యింది. బస్సులపై రాళ్లు రువ్వడం, మిగతా కంటెస్టెంట్‌ల కార్లపై కొందరు దాడి చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. అమర్‌దీప్, అశ్విని, బిగ్ బాస్ బజ్ హెస్ట్ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.

అయితే విన్నర్‌గా గెలవడంతోనే  తాను అందరినీ కలిసి వెళ్లాలి అనుకున్నానంటూ ప్రశాంత్‌ చెప్పుకొచ్చాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కారు నడిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రెండు కేసులు పెట్టగా ఒక దాంట్లో పల్లవి ప్రశాంత్ పేరు కూడా చేర్చారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నాన్ బెయిలబుల్ కావడంతో ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం నుంచి పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. తన సొంత ఊరికి కూడా వెళ్లారు. అయితే అక్కడ పల్లవి ప్రశాంత్ మాత్రం కనిపించడం లేదు. తన తల్లిదండ్రులు నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదు అని చెప్పినట్టు సమాచారం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading