Home » ధోని ఫ్యాన్స్ కు నిరాశ…!

ధోని ఫ్యాన్స్ కు నిరాశ…!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం కేవలం ఐపీఎల్ లో మాత్రం ఆడుతున్నాడు అనేది తెలిసిందే. 2019లో ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత తమ అభిమాన ఆటగాడిని గ్రౌండ్ లో చూడటానికి ఏడాది వేచి చూస్తున్నారు ధోని ఫ్యాన్స్. ప్రతి ఏడాది రెండు నెలలు ఉండే ఐపీఎల్ తర్వాత ధోని మళ్ళీ కనిపించకుండా పోతున్నాడు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Advertisement

కానీ ఈ మధ్య ధోని గురించి వచ్చిన కొన్ని వార్తలు అనేవి ధోని ఫ్యాన్స్ కు సంతోషం పంచాయి. వచ్చే ఏడాది నుండి ప్రారంభం అవుతున్న సౌత్ ఆఫ్రికా క్రికెట్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఓ జట్టును కొనుగోలు చేసింది. అయితే ఆ జట్టులో ధోనిని ఆడించాలని.. లేదంట మెంటార్ గా ఉంచాలని భావించింది. ధోని కూడా ఈ విషయంలో బీసీసీఐ యొక్క అనుమతి అనేది కోరాడు.

Advertisement

అయితే ఇప్పుడు తాజాగా ధోని ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చింది బీసీసీఐ. ధోని ఆ సౌత్ ఆఫ్రికా లీగ్ లో ఏ విధంగా కూడా పాల్గొనడానికి వీలు లేదు అని తేల్చింది. ఒకవేళ ధోని అందులో ఆడాలి అనుకుంటే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాలని సూచించింది. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ లో చెన్నైలోనే అక్కడి అభిమానుల ముందు ఐపీఎల్ కు వీడ్కోలు పలకాలి అనుకున్న ధోని సౌత్ ఆఫ్రికా లీగ్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్‌ తో పోటీకి సిద్ధమైన పీఎస్ఎల్..!

నాకు పని ఇప్పించడని అడుగుతున్న భారత మాజీ క్రికెటర్..!

Visitors Are Also Reading