Home » బిడ్డ మ‌ర‌ణంతో క‌న్నీరు మున్నీరైన త‌ల్లి కొండ‌ముచ్చు..!

బిడ్డ మ‌ర‌ణంతో క‌న్నీరు మున్నీరైన త‌ల్లి కొండ‌ముచ్చు..!

by Anji
Ad

మ‌నుషుల‌లోనే కాదు.. మూగ జీవాల‌లో కూడా త‌ల్లి ప్రేమ‌కు వ్య‌త్యాసం ఉండ‌ద‌ని రుజువు చేసింది ఓ కొండ‌ముచ్చు. సృష్టిలో క‌లుషితం లేనిది ఏదైనా ఉన్న‌దంటే.. అది ఒక త‌ల్లి ప్రేమ అని, ఈ వీడియో చూస్తే మ‌రొక‌సారి అర్థ‌మ‌వుతుంది. క‌న్న బిడ్డ క‌ళ్ల ముందే మ‌ర‌ణిస్తే ఆ త‌ల్లి ప‌డే ఆవేద‌న‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. రోడ్డు ప్ర‌మాదంలో ఓ బుజ్జి కొండ ముచ్చు మంత్రి చెంద‌డంతో త‌ల్లి కొండ ముచ్చు ప‌డ్డ బాధ వ‌ర్ణ‌ణాతీతం. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప‌ట్ఠ‌ణంలోని ర‌హ‌దారుల‌పై వాహ‌నాలు వేగంగా ప్ర‌యాణిస్తున్నాయి. రోడ్డు దాటే క్ర‌మంలో చిన్న కొండ ముచ్చును గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కుంది. దీంతో అది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాల‌ను కోల్పోయింది.

Advertisement

Advertisement

బిడ్డ అచేత‌నంగా ఉండ‌డం చూసి త‌ల్లి కొండ ముచ్చు త‌ల్ల‌డిల్లి పోయింది. బిడ్డ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక క‌న్నీరుమున్నీరు అయింది. బిడ్డ‌ను ఒడిలో పెట్టుకుని వెల‌వెల‌బోయింది. కాసేపు ఆ బాధ‌లో ఏమి చేయాలో అర్థం కాక రోడ్డు డివైడ‌ర్ దాటుతూ అటు ఇటు ప‌రుగులు తీసింది. ఎవ‌రైనా త‌న బిడ్డ‌ను కాపాడుతారేమో అని ఆశ‌గా చూసింది. త‌ల్లి కొండ ముచ్చు త‌న బిడ్డ‌ను కాపాడుకోవాల‌ని చేసిన ప్ర‌య‌త్నం అక్క‌డి వారి హృద‌యాల‌ను క‌లిచి వేసింది. నిజంగా త‌ల్లి ప్రేమ ఎంత గొప్ప‌దో ఈ ఘ‌ట‌న చూస్తే అర్థ‌మ‌వుతుంది.

Also Read :  ఆర్‌సీబీ కెప్టెన్సీ కోహ్లీ వ‌దిలేసిన‌ట్టు ఎందుకు ప్ర‌క‌టించారో తెలుసా..?

Visitors Are Also Reading