Home » ముంబై విధుల్లో బైక్ పై విరుష్క..!

ముంబై విధుల్లో బైక్ పై విరుష్క..!

by Azhar
Ad

భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు విశ్రాంతి అనేది తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ క్రికెట్ ప్రపంచంలోనే గొప్ప ఆటగాడు. అతనికి ఉన్న ఫాలోయింగ్ అనేది ఇప్పుడు ఉన్న ఆటగాళ్లలో ఎవరికీ లేదు అనేది నిజం. ఇక ఆ క్రేజ్ వల్లే ఎన్నో యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు కోహ్లీ. కానీ ఈరోజ్జు కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ చేసిన పని అనేది అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Advertisement

విరాట్ కోహ్లీ ఈరోజు తన భార్యను తీసుకొని బయటకు షికారు చేయడానికి వచ్చాడు. ఇది వినగానే అందరూ ఏదో పెద్ద లగ్జరీ కారులో వచ్చాడు అనుకుంటే తప్పే. ఓ మాములు మధ్య తరగతి భర్త తన భార్యను బయటకి తీసుకువచ్చినట్లు ఓ స్కూటీ మీద అనుష్కను ఎక్కించుకొని ముంబైలోని విధుల్లో తిరిగాడు కోహ్లీ. ఆ సమయంలో ఈ ఇద్దరు హెల్మెట్స్ అనేవి పెట్టుకున్నారు.

Advertisement

అయిన కొంతమంది కోహ్లీ, అనుష్కను గుర్తు పట్టి వారి వీడియోలు అనేవి తీయటం ప్రారంభించారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు బ్యాటింగ్ లో ఫామ్ కోల్పోయిన విరాట్.. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత మళ్ళీ జట్టుతో కలవలేదు. కోహ్లీ నేరుగా ఈ నెల 28న ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లోనే బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి రాబోతున్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో విరాట్ రాణిస్తాడా.. లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ తో మ్యాచ్ అంటేనే ఒత్తిడి..!

1000 రోజులు పూర్తి చేసుకున్న విరాట్..!

Visitors Are Also Reading