Home » స‌మ‌తామూర్తి స‌న్నిధిలో అల్లుఅర్జున్‌.. ఫోటోలు వైర‌ల్‌..!

స‌మ‌తామూర్తి స‌న్నిధిలో అల్లుఅర్జున్‌.. ఫోటోలు వైర‌ల్‌..!

by Anji
Ad

హైద‌రాబాద్ మ‌హాన‌గరానికి స‌మీపంలో ఉన్న‌టువంటి ముచ్చింత‌ల్ లో శ్రీరామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల్లో భాగంగా ప్ర‌త్యేక పూజ‌లు, హోమాలు నిర్వ‌హిస్తూ ఉన్నారు. ఇటీవ‌లే భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. ఉత్స‌వాల్లో భాగంగా రోజుకొక వీఐపీ విచ్చేసి స‌మ‌తామూర్త విగ్ర‌హాన్ని సంద‌ర్శించి.. స‌హ‌స్రాబ్ది ఉత్సావాల్లో ప్ర‌త్యేజ పూజ‌లు చేస్తున్నారు. వీఐపీల‌తో పాటు ప్ర‌జలు కూడా పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు.

Also Read :  నాగార్జున కొత్త కోడ‌లును వెతికారా..? ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడా..?

Advertisement

ఈ నేప‌థ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సైతం స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల‌కు హాజ‌ర‌య్యారు. చిన్న‌జీయ‌ర్ స్వామి స్వ‌యంగా ఆయ‌న‌ను ఆ ప్రాంతాన్ని అంతా తిప్పి చూపించారు. అక్క‌డి విశేషాల‌ను వివ‌రించారు. ఇక అల్లుఅర్జున్‌ను చూసిన అభిమానులు ఆయ‌న‌తో ఫొటోలు దిగ‌డానికి పోటీ ప‌డ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల‌వుతున్నాయి. ఇక ఈయ‌న సినిమాల విష‌యానికొస్తే అల్లుఅర్జున్ న‌టించిన పుష్ప సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. 350 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Advertisement

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం, బ‌న్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ క‌లిసి పుష్ప‌ను టాప్‌లో నిల‌బెట్టాయి. ఈ సినిమా ఇప్పుడు పార్ట్‌-2 తెర‌కెక్కించేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు సుకుమార్ ఈ సినిమాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌ట‌. ఈసారి మ‌రింత మంది స్టార్లను తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. పార్ట్‌-2 సినిమా షూటింగ్ కాస్త స‌మ‌యం పెట్టే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చివ‌రి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇప్పుడు పార్ట్‌-2లో బాలీవుడ్ నుంచి కూడా ఒక స్టార్ న‌టుడిని తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read :  కేసీఆర్‌పై రోజా ప్ర‌శంస‌లు.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading