Home » కేసీఆర్‌పై రోజా ప్ర‌శంస‌లు.. ఎందుకో తెలుసా..?

కేసీఆర్‌పై రోజా ప్ర‌శంస‌లు.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌.కే.రోజా. ఇవాళ ఆమె యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. యాదాద్రి ఆల‌యాన్ని అద్భుతంగా నిర్మాణం చేయిస్తున్నారు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కాలంలో ఎవ‌రికీ ఇలాంటి అవ‌కాశం ద‌క్క‌లేని పేర్కొన్నారు. గ‌తంతో పోల్చితే ఇప్పుడు ఆల‌యాన్ని అద్భుతంగా డిజైన్ చేసి పునఃనిర్మాణ చేశార‌ని, ఈ కాలంలో ఎవ‌రికీ ఇలాంటి అవ‌కాశం ద‌క్క‌లేద‌ని పేర్కొన్నారు.

Also Read :  నాగార్జున కొత్త కోడ‌లును వెతికారా..? ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడా..?

Advertisement

Advertisement

భ‌గ‌వంతుడే కేసీఆర్ ద్వారా త‌న‌కు కావాల్సిన ఆల‌యాన్ని నిర్మించుకున్నారని వ్యాఖ్యానించారు రోజా. దేవాల‌యం నిర్మించాలంటే భ‌గ‌వంతుడి ఆశీస్సులు త‌ప్ప‌కుండా ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ అంద‌రి స‌హ‌కారంతో దేవుడి ఆశీస్సుల‌తో ఆల‌యాన్ని నిర్మించార‌ని కొనియాడారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు సంతోషించే విధంగా ఆల‌యం నిర్మాణం జరిగింది. ఏపీలోని గుంటూరు నుంచి గుడి నిర్మించ‌డం కోసం రాయి తీసుకొచ్చార‌ని.. ఎప్ప‌టికీ తెలుగువారు అన్న‌ద‌మ్ముల్లు, అక్క‌చెల్లెల్లుగా క‌లిసి ఉంటార‌ని చెప్పారు. త‌న‌ తండ్రి స‌మానులైన‌ కేసీఆర్ సంతోషంగా ఉంటూ ప్ర‌జ‌ల‌ను సంతోషంగా ఉండేవిధంగా చూడాల‌ని ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి వారిని కోరుకున్న‌ట్టు రోజా వెల్ల‌డించారు.

Also Read :  స‌ర్కారు వారి పాట క‌ళావ‌తి సాంగ్ లీక్‌..?

Visitors Are Also Reading