Home » అయ్యో పాపం హైపర్ ఆదికి ఏమైంది.. ఇలా ఎందుకు చేశాడు..!!

అయ్యో పాపం హైపర్ ఆదికి ఏమైంది.. ఇలా ఎందుకు చేశాడు..!!

ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అటువంటి కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. అదిరే అభి టీంలో కంటెస్టెంట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి టీమ్ లీడర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఆది వేసే పంచులతో తనకంటూ ఓ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. జబర్దస్త్ షోకి అంత మంచి గుర్తింపు వచ్చేలా చేసిన హైపర్ ఆది గత కొద్ది రోజులుగా జబర్దస్త్ షో లో కనిపించడం లేదు. బుల్లితెర మీద మాత్రమే కాకుండా వెండితెర మీద కూడా తన ప్రతిభ కనబరుస్తున్న ఆది సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కొంతకాలంగా జబర్దస్త్ లో కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. కానీ నెల రోజులు గడుస్తున్నా ఆది జబర్దస్త్ కి రాకపోవడంతో ప్రేక్షకుల మదిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ఆది కనిపించడం లేదు. అయితే ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లో కూడా ఆది కనిపించకపోవడంతో అభిమానులు ఆది ఇక ఈటీవీ లో కనిపించరని కన్ఫామ్ చేస్తున్నారు. అయితే అందరిలాగే ఆది కూడా రెమ్యూనరేషన్ పెంచమని అడిగితే మల్లెమాల టీమ్ వారు ఒప్పుకోకపోవడంతో ఆది ఈటీవీ లోని షోల లో చేయడం మానేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మల్లెమాల వారు రెమ్యూనరేషన్ తక్కువగా ఇవ్వడంతో ఆది జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు వదిలేసి మాటీవీ లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ లో జాయిన్ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఐదు సంవత్సరాల నుంచి ఈటీవీలో ప్రసారమయ్యే పలు కామెడీ షోలు ఈవెంట్ లో సందడి చేసిన హైపర్ ఆది విషయంలో మల్లెమాల టీం ఇలా చేయడం సరైంది కాదు అని అభిమానులు మండిపడుతున్నారు. ఆది ఈటీవీ లో కనిపించకపోయేసరికి ఇంక వేరే ఏదైనా టీవీలో కనిపిస్తాడని అభిమానులు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

ALSO READ;

మ‌హేష్‌బాబుకు షాక్‌.. సోష‌ల్ మీడియాలో స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్‌..!

ఏపీ టెన్త్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఈ సారి ఫిజిక్స్ ప్ర‌శ్న‌ప‌త్రం మోడ‌ల్ ఇదే.. చూసుకోండి..!

 

Visitors Are Also Reading