Home » సోషల్ మీడియాకు దూరమైన బ్రహ్మాజీ…!

సోషల్ మీడియాకు దూరమైన బ్రహ్మాజీ…!

by Azhar
Ad
టాలీవుడ్ సినిమా అభిమానులకు తెలుగు నటుడు బ్రహ్మాజీ సుపరిచితమే. మొదట తెలుగు సినిమాల్లోకి హీరోగా వచ్చిన బ్రహ్మాజీ ఆ తర్వాత సెకండ్ హీరోగా నటించారు. ఇక ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలో కనిపిస్తున్న బ్రహ్మాజీ… హీరో తండ్రిగా… బాబాయ్ గా కమెడియన్ గా ఇలా ఏ పాత్ర దొరికితే ఆ పాత్రలో నటిస్తున్నారు. అయితే సినిమాలో ఎంతో బిజీగా ఉండే బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా చాల యాక్టివ్ గా ఉంటారు. తన ఫాలోవర్స్ కోసం ఎప్పుడు ఏదో ఒక్కటి అందులో పోస్ట్ చేస్తూనే ఉంటారు.
అయితే మామూలుగానే ఎప్పుడు సరదాగా ఉండే బ్రహ్మాజీ… సోషల్ మీడియాలో కూడా అలంటి పోస్టులే చేస్తుంటాడు. కానీ కొన్ని సమయాల్లో ఆయన సరదాగా చేసే పోస్టులు వివాదాలు కారణమవుతుంటాయి. ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు నరకం చూసారు. అలాంటి సమయంలో… వరదలపైన ఫన్నీగా నాకు పడవ కావాలంటూ పోస్ట్ చేసారు. అది పెద్ద చర్చకు కారణమైంది. ప్రజలనుండి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఆయనను సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ కూడా చేసారు.
అయితే ఇప్పుడు ఈ సొసైల్ మీడియాపై బ్రహ్మాజీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన ఫాలోవర్స్ ఖంగు తిన్నారు అని చెప్పవచ్చు. అదేంటంటే.. తాను సోషల్ మీడియాకు దూరం కాబోతున్నట్లు బ్రహ్మాజీ ప్రకటించారు. కానీ అది పూర్తిగా కాదు. కొద్దిరోజులకు మాత్రమే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఇందులూ కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. అయితే ఈమధ్యే బ్రహ్మాజీ కొడుకు హీరోగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అభిమానులను మెప్పించినా.. ఇప్పటివరకు మరో సినిమాను బ్రహ్మాజీ కొడుకు అనౌన్స్  చేయలేదు.

Advertisement

Visitors Are Also Reading