Home » భార్యపై అలిగిన భర్త..ఏకంగా 42 ఏళ్ళు ఆ ఒక్కటి చేయలేదట..!

భార్యపై అలిగిన భర్త..ఏకంగా 42 ఏళ్ళు ఆ ఒక్కటి చేయలేదట..!

by Sravanthi Pandrala Pandrala
Ad

భార్యాభర్తల అన్నాక కొంచెం తీపి, కొంచెం చేదు, కొంచెం కారం అనే విధంగా కష్టం, సుఖం, గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.. వీటన్నింటినీ సమపాళ్లలో భరించి సంసారం అనే నావను ముందుకు నడిపితేనే ఈ సమాజంలో గౌరవప్రదంగా బ్రతకగలం.. భార్యాభర్తలు అన్నాక ప్రపంచ కుబేరుల నుంచి బీద వాళ్ళ వరకు ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది.. ఆ గొడవలను సర్దుకుని ముందుకు పోతేనే జీవన గమనం ఉంటుంది. లేదంటే జీవితం దారి తప్పినట్టే.. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే మహా అయితే ఒకటి రెండు వారాలు మాట్లాడకుండా ఉంటారు. ఇంకాస్త అయితే నెలరోజులు పట్టవచ్చు.. కానీ 42 ఏళ్లు భార్యతో గొడవ పెట్టుకుని ఆ పని చేయలేదట.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Advertisement

also read;Vasthu tips: ఈ ఏడాది ముగిసేలోపు ఈ 4 వస్తువులు ఇంటికి తెచ్చుకోండి.. అన్ని సమస్యలు పరార్..!!

Advertisement

ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి భార్యపై అలిగి 42 సంవత్సరాలుగా అన్నం తినడం మానేశారట. కేవలం టి, అటుకులు తింటూ జీవనాన్ని కొనసాగించారట. అలాగని ఆయన ఆమెతో మాట్లాడకుండా ఉండలేదు. కేవలం ఆమె చేతి వంట మాత్రం తినకుండా ఉన్నారు.. జైపూర్ జిల్లాలోని వికీపూర్ గ్రామానికి చెందిన రామచంద్ర 76 సంవత్సరాలు, ఆయన 22 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో సీత అనే మహిళతో వివాహం జరిగింది. 42 ఏళ్ల క్రితం ఒక రోజు రామచంద్ర కూలి పని చేసుకొని ఇంటికి వచ్చి భోజనం పెట్టమని భార్యను అడిగాడట..

కానీ ఆమె అనారోగ్యం కారణంగా ఆరోజు వంట చేయలేదు. ఈ విషయాన్ని భర్తకు తెలియజేసింది.. పరిస్థితిని అర్థం చేసుకోకుండా రామచంద్ర ఆమెతో గొడవపడ్డాడు.. ఇక అప్పటినుంచి ఆమెపై అలిగాడు.. ఇక పూర్తిగా అన్నం తినడం మానేశాడు.. తనకు ఆకలి వేసినప్పుడల్లా టీ లేదా అటుకులు తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.. అన్నం తినమని భార్య ఎంత బ్రతిమిలాడిన ఆయన ఇప్పటికీ అన్నం తినడం లేదట.. ఈ విషయం కాస్త బయటకు రావడంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read;

Visitors Are Also Reading