Home » Vasthu tips: ఈ ఏడాది ముగిసేలోపు ఈ 4 వస్తువులు ఇంటికి తెచ్చుకోండి.. అన్ని సమస్యలు పరార్..!!

Vasthu tips: ఈ ఏడాది ముగిసేలోపు ఈ 4 వస్తువులు ఇంటికి తెచ్చుకోండి.. అన్ని సమస్యలు పరార్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

2022 ముగింపు దశకు చేరుకుంది.. శుభకృత నామ సంవత్సరం ముగియడానికి కొత్త సంవత్సరం రావడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు.. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ కొన్ని చిట్కాలను పాటించాలని జ్యోతిష్య వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ సంవత్సరం ముగిసే సమయానికి మీ ఇంట్లోకి ఈ వస్తువులు తప్పనిసరిగా తెచ్చుకోవాలని, దీనివల్ల మీ భవిష్యత్తు మారుతుందని వారు తెలియజేస్తున్నారు. మరి అవేంటో మనం చూద్దాం..
శంఖం:

దక్షిణ శంఖం సముద్ర మథనం నుండి ఉద్భవించిన 14 రత్నాలలో ఇది ఒకటి. ఈ శంఖాన్ని శుభముహూర్తంలో పూజించి ఎర్రటి వస్త్రంలో కట్టుకొని, మన డబ్బులు ఉండే ప్రదేశంలో పెట్టాలి.. దీనివల్ల సమస్యలు తొలగిపోయి గృహ దోషాలు కూడా పరారై, నూతన ఏడాదికి వినూత్న శక్తి లభిస్తుంది.
గోమాతి చక్రాలు:

Advertisement

also read:పెళ్లి చేసుకోబోతున్న సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్.. వరుడు ఎవరంటే ?

Advertisement

గోమాతి చక్రం శ్రీహరి మహావిష్ణువు చక్రాలలో ఒకటిగా భావిస్తారు. ఈ చక్రం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉందని నమ్ముతారు.. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలిగిపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుందట. ఇది చెడు ప్రభావం నుంచి మనల్ని కాపాడుతుంది.
లాఫింగ్ బుద్ధ:

లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉండడం అదృష్టంగా భావిస్తారు. ఒకవేళ లాఫింగ్ బుద్ధ ఎవరైనా బహుమతిగా ఇస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు.. లాఫింగ్ బుద్ధ సంచి మోస్తున్నట్లు ఉంటే మాత్రం మీకు డబ్బు సమస్యలు తొలగిపోయినట్లే.. ఈ విగ్రహాన్ని దుకాణం లేదా ఇంట్లో ఈశాన్యం దిశలో పెడితే అదృష్టం ఉంటుంది. కాబట్టి కొత్త సంవత్సరానికి ముందు ఈ వస్తువు తెచ్చుకోండి.
తులసి మొక్క:

మన హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కను లక్ష్మీదేవితో సమానంగా కొలుస్తారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే డబ్బుకు కొదవ ఉండదు.. ఈ ఏడాది ముగియడానికి ముందు తులసి మొక్కను తెచ్చుకోండి. అంతేకాకుండా ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా పూజ చేయాలి దీని వల్ల మీకు అనుకున్న విజయం అందుతుంది..

also read:

Visitors Are Also Reading