బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.
READ ALSO : బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్-ఉపాసన!
Advertisement
సినిమా కథ ఏంటన్న దానిపై అందరిలో క్యూరియాసిటీ పెంచేసింది మూవీ. కాగా, ఈ సినిమా నిన్ననే థియేటర్లలో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమాలోని థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను చూసెందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమా తాజాగా ఓటిటి పార్ట్నర్ ను లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Advertisement
READ ALSO : Malli Pelli : ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్….రమ్య రఘుపతిని టార్గెట్ చేశాడుగా!
ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ విరూపాక్ష డిజిటల్ రైట్స్ ను మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ పార్ట్నర్ గా మారింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక ఈ చిత్రాన్ని ఓటిటిలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 45 రోజులు పట్టనుందన్నమాట.
READ ALSO : IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!