Home » Malli Pelli : ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్….రమ్య రఘుపతిని టార్గెట్ చేశాడుగా!

Malli Pelli : ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్….రమ్య రఘుపతిని టార్గెట్ చేశాడుగా!

by Bunty
Ad

 

టాలీవుడ్ నటుడు నరేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ నటుడు నరేష్ విజయ కృష్ణ కథానాయకుడుగా రూపొందించిన తాజా చిత్రం ‘మళ్లీ పెళ్లి’. చిత్ర పరిశ్రమలో నరేష్ అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చేస్తున్న చిత్రమిది. మెగా మూవీ మేకర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ‘మళ్లీ పెళ్లి’ సినిమా రూపొందుతోంది.

READ ALSO : ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Advertisement

దీనికి రచయిత కూడా ఆయనే. ఇందులో నరేష్ కు జోడిగా ప్రముఖ నటి పవిత్ర లోకేష్ నటించారు. చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం అందింది. తెలుగు, కన్నడ భాషలో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి నరేష్ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయకృష్ణ మూవీ సంస్థను పునఃప్రారంభించారు. ఇక ఈరోజు ‘మళ్లీ పెళ్లి’ టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నరేష్. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకులకు ఇంకా పెద్ద షాక్ తగిలింది.

Advertisement

READ ALSO : Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..

అదేంటంటే తన సొంత వివాదాన్ని సినిమాగా చూపించబోతున్నారు నరేష్. రమ్య రఘుపతితో గొడవలు, ఆమె మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలు, హోటల్ లో నరేష్, పవిత్ర లోకేష్ దొరికిపోవడం వంటి సన్నివేశాలతో టీజర్ కట్ చేశారు. బహుశా రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ ఈ సినిమా కథ ఉండబోతోందేమో. ఈ టీజర్ చూసిన చాలామంది నరాలు తెగిపోయాయి… ఇదేం ట్విస్ట్ బాబోయ్ అంటూ యూట్యూబ్ లో కామెంట్లు పెడుతున్నారు.

READ ALSO : IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!

Visitors Are Also Reading