యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ ది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. హీరో, దర్శకుడిగా ఇద్దరు కలిసి చేసిన జనతా గ్యారేజ్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు భారీ వసూళ్లు సాధించి అందరికీ లాభాలు అందించింది. అంతకుముందు ఎన్టీఆర్ ‘బృందావనం’ చిత్రానికి కొరటాల రచయితగా చేశారు. ఆ సినిమా కూడా హిట్టే.
READ ALSO : ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
Advertisement
ఇప్పుడు ఇద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహించనున్న తాజా సినిమా మార్చిలో సెట్స్ మీదకు ఇప్పటికే వెళ్ళింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఇదంతా పక్కకు పెడితే, తారక్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్-సమీరా రెడ్డితో ఎఫైర్ నడిపాడని… త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా పలు పత్రికల్లో వార్తలు ప్రచురించాయి.
Advertisement
READ ALSO : IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!
ఈ క్రమంలోనే తారక్ అలాంటిది ఏదీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. కాగా ఇప్పటికీ ఇదే విషయంపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమం లోనే పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న తనపై ఇలాంటి వార్తలు ఎలా రాస్తున్నారు అంటూ బాధపడుతున్నారట ఎన్టీఆర్. అంతేకాదు ఇలా ఉన్నది లేనిది తనపై ప్రచారం చేస్తే వాళ్లకు ఒరిగేది ఏంది అంటూ బాధపడుతున్నారట. ఎన్ని సార్లు చెప్పినా పదేపదే అదే తప్పు చేస్తూ నన్ను టార్చర్ చేస్తున్నారు అంటూ బాధ పడిపోతున్నారట ఎన్టీఆర్. ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ గా మారింది.
READ ALSO : Malli Pelli : ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్….రమ్య రఘుపతిని టార్గెట్ చేశాడుగా!