Home » సీరియస్ అయిన అలియా.. ఎందుకు..?

సీరియస్ అయిన అలియా.. ఎందుకు..?

by Azhar
Ad

అలియా భట్.. బాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్స్ లలో ఒక్కరు. ఈ మాదే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడోగా నటించి తెలుగు అభిమానులకు పరిచయమైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 14న అభిమానులకు షాక్ ఇస్తూ తమ ప్రియుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత హనీమూన్ కు వెళ్లిన ఈ మధ్యే తిరిగి ఇండియాకు వచ్చారు. కానీ అప్పుడే మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది మన అలియా. అందుకు కారణం అలియా భట్ ఇప్పుడు తల్లి కాబోతుండటం.

Advertisement

పెళ్లి అయిన రెండున్నర నెలలకు తాను తల్లి కాబోతున్నాను అని అలియా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత ఇండియా సెలబ్రెటీలు, అభిమానులు అందరూ ఆమెకు అలాగే రణబీర్ కపూర్ కు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ అనేవి చెప్పడం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం అలియా భట్ ఇంగ్లాండ్ లో ఉంది. అందువల్ల తొందరలోనే రణబీర్ కపూర్ ఇంగ్లాండ్ కు వెళ్లి ఈమెను జాగ్రత్తగా తీసుకువస్తాడు అని సోషల్ మీడియాలో ప్రచారం అనేది జరుగుతుంది. కానీ ఈ ప్రచారం పై అలియా సీరియర్ అయ్యింది.

Advertisement

తన పై వస్తున్న కామెంట్స్ పై.. మీకు తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. నేను ఏమైనా వస్తువునా జాగ్రత్తగా తీసుకురావడానికి… మనిషిని అంటూ కామెంట్స్ చేసింది. ఇక ఫ్యాన్స్ కూడా అలియాకు గట్టిగానే ఇస్తున్నారు. నువ్వు ఇప్పుడు ప్రగ్నెంట్ కావడం వల్లే అందరూ జాగ్రత్త అనే పదం వాడుతున్నారు. అంటే కానీ నువ్వు మనిషివి కాదు వస్తువువు అని వాడటం లేదు. ఇది కూడా తెలియకపోతే ఎలా అని అంటున్నారు. మామూలుగానే ఓ ప్రగ్నెంట్ లేడి అంటేనే అందరూ ప్రతి విషయంలో జాగ్రత్త అనే పదం వాడుతారు. కానీ అలియాకు ఇది కూడా తెలియదు అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

తన భర్త కెప్టెన్ తేలిగ్గా కాలేదు అంటున్న సంజనా..!

కోహ్లీ సెంచరీ పై ఇంగ్లాండ్ వివాదాల కామెంటేటర్ షాకింగ్ కామెంట్స్..!

Visitors Are Also Reading