Home » “సర్కారువారిపాట” లో జనసేనను టార్గెట్ చేశారా….? గాజు గ్లాసు సీన్ పై పవన్ ఫ్యాన్స్ అనుమానాలు…!

“సర్కారువారిపాట” లో జనసేనను టార్గెట్ చేశారా….? గాజు గ్లాసు సీన్ పై పవన్ ఫ్యాన్స్ అనుమానాలు…!

by AJAY

మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా నిన్న మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా పోస్టర్లు మరియు ట్రైలర్ ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు మాత్రం మిక్స్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు గత సినిమాలు సరిలేరు నీకెవ్వరు,

pawan-janasena

 

శ్రీమంతుడు లాగే ఈ సినిమాలో కూడా మెసేజ్ వుందని కాబట్టి సినిమా కొత్తగా అనిపించలేదు అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా కథ బాగున్నప్పటికీ కథనం సరిగ్గా లేదని మరికొందరు భావిస్తున్నారు. ఈ సినిమాకి ముందు పోకిరి, గీత గోవిందం లను మిక్స్ చేసినట్టుగా ఉంటుందని మేకర్స్ అంచనాలు పెంచారు. దాంతో భారీ అంచనాల నడుమ థియేటర్ కు వెళ్లి సినిమా చూసిన ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలోని కొన్ని సీన్లు పవన్ కళ్యాణ్ అభిమానులను హర్ట్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో భీమ్లా నాయక్ సినిమా రింగ్ టోన్ వాడటం పై పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అదే విధంగా సినిమాలోని ఓ సన్నివేశంలో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్న ప్రభాస్ శ్రీను గొంతులోకి గ్లాస్ గాజు పంపించడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

గాజు గ్లాసు పంపించడం ఏంటండి బాబు ఇప్పుడు ఎలా బయటకు వస్తుంది… అని ప్రభాస్ శ్రీను మహేహా బాబును అడిగితే…. రికవరీ ఏజెంట్ కదా రికవరీ చెయ్యి అంటూ మహేష్ బాబు డైలాగ్ కొడతారు. దాంతో గాజు గ్లాస్ ను ఆ సీన్ లో వాడటం కూడా జనసేన ను టార్గెట్ చేయడమే అంటూ కొంతమంది పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Also read :

గుర్తుపట్టనంతగా మారిపోయిన చందమామ హీరోయిన్….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…!

అలాంటి వీడియోలు చేస్తున్నాడు అంటూ యూట్యూబర్ పై కరాటే కల్యాణి దాడి…వీడియో వైరల్…!

Visitors Are Also Reading